India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్పై భారత్ విజయం
India Won Against Pakistan In T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భారత్ శుభారంభం చేసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో.. పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. పాక్ కుదిర్చిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించింది. విరాట్ కోహ్లీ (82) విశ్వరూపం చూపించడంతో పాటు హార్దిక్ పాండ్యా రాణించడంతో.. భారత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకానొక దశలో ఓడిపోతుందనుకున్న భారత్.. చివర్లో నెగ్గింది. దాయాది దేశాన్ని మట్టికరిపించి, ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంటనే ఔటైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్(51) అర్థశతకాలతో లాక్కొచ్చారు. మూడో వికెట్కి 76 పరుగులు జత చేసి, తమ పాక్ జట్టుని ఆదుకున్నారు. ఆ తర్వాత వరుస వికెట్లు పడినా, ఓవైపు మసూద్ పరుగుల వర్షం కురిపించాడు. చివర్లో అతనికి షాహీన్ ఆఫ్రీది చేయూతనందించడంతో, పాక్ జట్టు 159 పరుగులు చేయగలిగింది. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో తడబడింది. వరుస వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడిపోయింది. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం, తొలి 10 ఓవర్లలో 45 పరుగులే చేయడంతో.. భారత్ నెట్టుకురావడం దాదాపు కష్టమేనని అంతా భావించారు.
Also Read
- IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
- Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
- Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
- Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
అయితే.. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రం మ్యాచ్ని ఒక్కసారిగా మలుపు తిప్పేశారు. వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా.. మొదట్లో చాలా మెల్లగా ఆడిన కోహ్లీ, ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సులతో అదరగొట్టేశాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, హార్దిక్ పాండ్యా ఔటవ్వడంతో భారత్ మళ్లీ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే.. బౌలర్ ఒక నోల్ బాల్ వేయడం, కోహ్లీ కూడా సిక్స్తో చెలరేగడంతో, చేధన సులభతరం అయ్యింది. 2 బంతుల్లో 2 పరుగులు చేయాలన్నప్పుడు కార్తీక్ ఔటయ్యాడు. చివర్లో వచ్చిన అశ్విన్.. సింగిల్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఏదేమైనా.. ఈ మ్యాచ్లో కోహ్లీ హీరోగా నిలిచాడు.
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!