ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు.…
కరోనా మహమ్మారి సమయంలో అందరినీ భయపెడుతోంది జోకర్ సాఫ్ట్వేర్.. దీనిబారినపడి యువత తీవ్రంగా నష్టపోతున్నారు.. ఇప్పటికే గూగుల్ ఐదుసార్లు జోకస్ సాఫ్ట్వేర్ను డిలీట్ చేసింది.. అయినా.. మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంది.. యువతను దెబ్బకొడుతూనే ఉంది.. ముఖ్యంగా మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్వేర్ కుదిపేస్తూనే ఉంది.. వివిధ పద్ధతుల్లో మొబైల్ ఫోన్స్, డెస్క్ టాప్లపై ప్రత్యక్షమవుతూనే ఉంది.. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత సమాచారం వెళ్లిపోతోంది.. బ్యాంకు వివరాల నుంచి…
హైదరాబాద్ షాద్ నగర్ లో ఓ నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. నేరుగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తాడు వార్డ్ బాయ్. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు నకిలీ డాక్టర్ ప్రవీణ్. ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం చేస్తున్నాడు అంటూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో 420,336 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు షాద్ నగర్ పోలీసులు. వివిధ ఫిర్యాదులతో…
గతకొన్ని రోజులుగా పేరుగ్గుతూ తగ్గుతూ పుత్తడి ధరలు ఈరోజు స్థిరంగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరల్లో నిరంతరం తేడాలు ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల…
హైదరాబాద్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోదాంపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఆకాష్ అనే వ్యాపారి మంగల్హాట్ అగపురా సీతారాంబాగ్ లోని గోదాంలో అక్రమంగా ఫారెన్ సిగరెట్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రూ.20 లక్షల విలువ చేసే విదేశీ కంపెనీకి చెందిన ఫారిన్ సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. పారిస్, బ్లాక్ సిగరెట్స్ దాదాపు 480 సిగరెట్ ప్యాకెట్…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజ్ భవన్ లో మొక్కను నాటారు. అనంతరం మొక్కకు నీటిని పోశారు. ఆపై ఎంవీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు ఎన్వీ రమణను…
ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి…
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ నిన్నటిరోజున బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ధర్మేంధ్రప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. బీజేపీలో చేరిన ఈటలపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదని విమర్శించారు. కమ్యునిస్టుల భావజాలం ఎక్కడపోయిందని, ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని అన్నారు. టీఎంసీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి బీజేపీ…
తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. రోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చెపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీసుల ఆద్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు, వారి బంధువులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు హోంశాఖా మంత్రి,సీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని, త్వరలోనే రాష్ట్రంలో తిరిగి మాములు జీవనం ఆరంభం…
రెండు రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియిన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,500 కి చేరింది. 10 గ్రాముల24 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేసేందుకు…