హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేసారు. వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఈ దాడులు చేసారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, మహంకాళి, ఖర్కనా , మరెడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్న అన్ని స్పా లపై దాడులు జరిపారు పోలీసులు. మసాజ్ సెంటర్ల ముసుగులో నిభందనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ కు పాల్పడుతున్నారు పలువురు స్పా నిర్వాహకులు. దాంతో…
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 49 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.…
భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈనెల 12 వ తేదీ నుంచి నవంబర్ 22 వ తేదీ వరకు కోటి దీపోత్సవం వేడుకలను నిర్వహించారు. కోటి దీపోత్సవంలో నేడు ఆఖరిరోజు కావడంతో ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చారు. Read: ఐపీఓకి…
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంస నీయమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గమనించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడానికి విశ్వగురు అధినేత సత్యవోలు రాంబాబు చేస్తున్న కృషి గొప్పదని ఆయన కొనియాడారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమ వారం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా శర్మన్ హాజరయ్యారు. వివిధ…
సికింద్రాబాద్ లోని రసూల్పుర,పికెట్ లోని వ్యాక్సినేషన్ సెంటర్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకా శాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు తమంతట తాముగా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని, అధికా రులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా హైదరాబాద్ను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని వ్యాక్సిన్…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,…
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమం 10వరోజుకు చేరింది. 10వ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహించడం అంత సులువేమీ కాదని.. కానీ అసాధ్యాన్ని నరేంద్ర చౌదరి సుసాధ్యం చేశారని కిషన్రెడ్డి కొనియాడారు. అంతేకాకుండా…
భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ లు సంయుక్తంగా సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ నాయరాజ పాద మంజీర నాట్యం పేరిట నిర్వహించిన పేరిణి నాట్యం, శివ తాండవం, ఆంధ్రనాట్యం కార్యక్ర మానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకూళా భరణం కృష్ణమోహన్ , ప్రొఫెసర్ దైజ్ఞశర్మ,ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధికారి, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు హాజర య్యారని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కె.వి. రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు…
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. ఔటర్ రింగురోడ్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. తాజాగా ఓ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆగి వున్న లారీని ఢీ కొంది ఓట్రక్. దీంతో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్ లో ఇరుక్కుపోయిన క్లీనర్, తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వాహనదారులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక…
పట్టణాభివృద్ధి విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకులను శనివారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు మొదటి ర్యాంక్ దక్కింది. ఈ జాబితాలో గుజరాత్లోని సూరత్ రెండో ర్యాంకును, ఏపీలోని విజయవాడ 3వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఏపీ నుంచి రెండు పట్టణాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏపీలోని విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచింది. టాప్-10 ర్యాంకులను పరిశీలిస్తే ఇండోర్, సూరత్, విజయవాడ,…