హైదరాబాద్ మెట్రోకు నాలుగేళ్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం 69.2 కి.మీ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-రాయదుర్గం, ఎంజీబీఎస్-జేబీఎస్ కారిడార్ల మధ్య మెట్రో కూత పెడుతోంది.
Read Also: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
మెట్రో రైలు ద్వారా సగటున రోజూ 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కరోనా సమయంలో 169 రోజులు మెట్రోరైళ్లు డిపోలకే పరిమితం కాగా.. ఆ తర్వాత ప్రారంభమైనా ప్రయాణికుల సంఖ్య అప్పటి మాదిరిగా లేదు. దీంతో మెట్రో సంస్థ నష్టాల్లో ఉందని ఇటీవల నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండటంతో మెట్రోకు ఆదరణ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఐటీ కార్యాలయాలు పనిచేస్తుంటే.. రోజుకు లక్షన్నర మంది ఐటీ ఉద్యోగులు మెట్రో ద్వారా ప్రయాణించేవారని వారు అంచనా వేస్తున్నారు. నష్టాలను తగ్గించుకునేందుకు ఇటీవల మెట్రో రైలు సమాయాలను కూడా అధికారులు పెంచారు. ఉదయం 6 గంటలకు మొదటి సర్వీసు ప్రారంభం కాగా… రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైల్ నడిపేలా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ మెట్రోరైలు ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక కన్స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డు-2021ని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!