ఐదంకెల జీతాలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్పులు సాఫ్ట్ వేర్ అనగానే గుర్తొచ్చేది ఇవే. కానీ, లోలోపల పని ఒత్తిడికి గురవుతూ క్షణ క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ బ్రతుకుతున్నవారెందరో. అందులో కొందరు ఒత్తిడిని జయిస్తుండగా మరికొందరు మాత్రం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో భార్యా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.…
నల్లగొండ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జస్ట్ లిఫ్ట్ ఇచ్చిన పాపానికి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ వ్యక్తి. ఖరీదైన సెల్ఫోన్, డబ్బు కోసం ఓ దుండగుడు వేసిన ట్రాప్లో పడి అతను ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగింది? నల్లగొండ టు హైదరాబాద్.. జాతీయ రహదారి.. హైవేపై ఇమ్రాన్ అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు.. అదే హైవేపే.. నార్కట్పల్లి వద్ద ఓ గుర్తు…
Hyderabad: హైటెక్ సిటీ.. ఈ ఏరియాకి వెళ్తే.. ముఖ్యంగా నైట్ టైమ్.. మనం హైదరాబాద్లోనే ఉన్నామా..? లేక వేరే దేశంలో ఉన్నామా అనిపిస్తుంటుంది. కళ్లు జిగేల్మనాల్సిందే.. ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతం.. రాత్రైతే చాలు పోకీరీల చేతిలో బంధీ ఐపోతోంది. ఇన్స్టా రీల్స్ అని.. స్నాప్ లనీ.. బైక్, కార్ రేసింగ్లు అని.. ఇవి చాలవన్నట్టు ఆటోలు వేసుకుని మరికొందరు.. రచ్చరచ్చ చేస్తున్నారు. రాత్రైతే చాలు ఒకటే గోలగోల. అటువైపుగా వెళ్లాలంటేనే.. వాహనాదారులకు ధడ పుడుతోంది.…
Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ను CCS పోలీసులకు పంపారు. మొబైల్లో కొన్ని అనుమానిత మెసేజ్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు…
Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ను “అక్రమం” అని సజ్జనార్ ఎలా ప్రకటిస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
Family Suicide: హైదరాబాద్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్లో ఈరోజు తెల్లవారుజామున హృదయవిదారక ఘటన నెలకొంది.
SBI ATM Gun Fire: హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎమ్ వద్ద ఈరోజు (శనివారం) ఉదయం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. గన్తో కాల్పులు జరిపిన అఘాంతకులు రూ.6 లక్షల నగదును దోచుకెళ్లారు.
గంజాయి స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్లో స్మగ్లింగ్ దందా కోసం ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా దందా కొనసాగించినా.. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..!! గంజాయి బాగోతం కాస్తా పోలీసులకు గుప్పుమనడం.. వారు సోదాలు చేయడం.. వీళ్లు దొరికిపోవడం జరుగుతోంది. ఐతే పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేసినా.. స్మగ్లర్లు ఒక్కోసారి వేసిన స్కెచ్కు పోలీసులే షాకవుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ ధూల్పేట్లో అదే జరిగింది. Also Read:HYD STEROIDS ARREST: కండలు కాదు, బుడగలు.. స్టెరాయిడ్…
హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పులి వరుస దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి జిల్లాలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ , బేగంపేట అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. జనవరి 26వ తేదీన…
HYDRA DRF Rescue: అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని హైడ్రా DRF బృందం ఆదివారం అర్ధరాత్రి కాపాడింది. పాతబస్తీ జూ పార్కు దగ్గరలోని మిరాలం ట్యాంక్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరంతా మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నవారు. మీరాలం ట్యాంక్ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్ట్ కు వెళ్లిన కార్మికులు , ఇంజనీర్లు. రోజులాగే ఆదివారం ఉదయం మిరాలం…