Family Suicide: హైదరాబాద్లో పెను విషాదం.. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న ఓ కుటుంబం..
- హైదరాబాద్లో పెను విషాదం..
- చర్లపల్లి- ఘట్కేసర్ మధ్య ఎంఎంఎటీఎస్ రైల్ కింద పడిన ముగ్గురు..
- ఒకే కుటుంబానికి చెందిన విజయశాంతి రెడ్డి, చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide: హైదరాబాద్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్లో ఈరోజు తెల్లవారుజామున హృదయవిదారక ఘటన నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు బోడుప్పల్ లోని హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కూతురు చేతన (చైతన్య) రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Debt Burden on Indian States: అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
Also Read
ఇక, మృతురాలు విజయశాంతి రెడ్డి కూతురు చేతన రెడ్డి ఇంటర్ రెండో సంవత్సరం, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, మృతురాలు విజయశాంతి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి నెలకు సుమారు లక్ష రూపాయలు జీతం వస్తుంది.. ఇక, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పని చేస్తాడు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనట్లు కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. ఇక, మృతురాలు భర్త ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు. ఇక, ముగ్గురు ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!