Family Suicide: హైదరాబాద్లో పెను విషాదం.. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న ఓ కుటుంబం..
- హైదరాబాద్లో పెను విషాదం..
- చర్లపల్లి- ఘట్కేసర్ మధ్య ఎంఎంఎటీఎస్ రైల్ కింద పడిన ముగ్గురు..
- ఒకే కుటుంబానికి చెందిన విజయశాంతి రెడ్డి, చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide: హైదరాబాద్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్లో ఈరోజు తెల్లవారుజామున హృదయవిదారక ఘటన నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు బోడుప్పల్ లోని హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కూతురు చేతన (చైతన్య) రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Debt Burden on Indian States: అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
Also Read
ఇక, మృతురాలు విజయశాంతి రెడ్డి కూతురు చేతన రెడ్డి ఇంటర్ రెండో సంవత్సరం, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, మృతురాలు విజయశాంతి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి నెలకు సుమారు లక్ష రూపాయలు జీతం వస్తుంది.. ఇక, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పని చేస్తాడు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనట్లు కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. ఇక, మృతురాలు భర్త ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు. ఇక, ముగ్గురు ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!