హైదరాబాద్ నగరంలో డ్రంక్ డ్రైవింగ్ ఘటనలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. పోలీసుల కఠిన తనిఖీలు, భారీ జరిమానాలు, రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ, మద్యం సేవించి వాహనాలు నడిపే యువత దుశ్చర్యలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక కారు వేగంగా వచ్చి తనిఖీల్లో ఉన్న ఎస్సైపై నేరుగా దూసుకెళ్లింది.…
హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్లోని హోల్సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల…
ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఫతేనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫతేనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఓ యువతి ఈనెల 21న వెళ్లింది. ఆమెకు నెలకు రూ.22 వేల జీతం ఇస్తానని, ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలని, విజిటర్లతో మాట్లాడాలని స్కూల్ కరెస్పాండెంట్ చెప్పాడు. తన పీఏగా కూడా ఉండాలని…
యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు కన్నుమూశారు. రామ్ కి యాజమాన్యం నిర్లక్ష్యం చెత్త సేకరణ కార్మికుడు దుర్మరణం చెందాడని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుడు కర్నూలు జిల్లా, దుగ్గలి మండలం, పగిడిరాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై…
టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన…
హైదరాబాద్ లో ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు రోడ్లపై ప్రయాణిస్తున్న విషయం తెలిసి ట్రాఫిక్ పోలీసులు విస్మయానికి గురయ్యారు. TS34C1858 నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు ఉన్నాయి. చలాన్స్ మాత్రం ఒక్కరి పేరు మీద మాత్రమే పడుతున్నాయి. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి చలాన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాన్ ఆ నెంబర్ ప్లేట్ ఉన్న బైక్ ఓనర్ బేగరి గోపాల్ కు…
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు…
హైదరాబాద్ నగరంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, కనుమరుగవుతున్న జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా (HYDRAA) తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా గోల్కొండ కోట ప్రాంగణంలో ఉన్న 450 ఏళ్ల నాటి చారిత్రక జలవనరు ‘కటోరా హౌజ్’ పునరుద్ధరణకు హైడ్రా తన పూర్తి సహకారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ఈ కటోరా హౌజ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.…
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సందర్భంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్లోని వాడ్ (Vaud) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను…
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు కసాయి కొడుకు. స్థానికులు వెంటనే తల్లి రజినినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లికి వేరొకరితో అక్రమ సంబంధం ఉందని పక్కాగా ప్లాన్ వేసిన కొడుకు.. సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇంటికి పిలిచి మందు తాగించాడు రజిని కొడుకు. తాగిన తర్వాత గొడవ చేసి అతన్ని చంపే ప్రయత్నం…