తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పీడ్ పెంచారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని…
Airbus Beluga : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్లో ఒకటైన ఎయిర్ బస్ బెలూగా హైదరాబాదులో ల్యాండైంది. తిమింగలం ఆకారంలో ఉన్న ఎయిర్ బస్ బెలూగా విమానం కోల్కతాలోని జాయ్ సిటీ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కు ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. చెరువు మాయమైందంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మరో లేఖ రాశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన కలవాలని సూచించారు. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్ఏ రాసిన లేఖ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీని కూడా తనకు వీలైనంత…
నకిలీ బాబాకేసు భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎన్జీవో ఆపరేషన్ ఎంట్రీతో పాతబస్తీ చర్చనీయాంశంగా మారింది. నకిలీ బాబా మహిళలపై చేస్తున్న అరాచకాలకు తెరదించింది. అయితే పాతబస్తీ బాబా కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా సీఏ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. అనేక విషయాలను ప్రస్తావించిన పవన్.. ఈ క్రమంలో ఆయన తన సినీ, రాజకీయ జీవితాన్ని కూడా పంచుకున్నారు.. ఇదే సమయంలో.. తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తానొక ఫెయిల్యూర్…
విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కామంతో కన్నుమూసుకుపోయి విద్యార్థినిపై కామవాంఛతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడి చెయ్యడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మద్యం స్కామ్ బయటకు తీశారన్న ఆయన.. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతో సాఫ్ట్ గా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురుపై కేసు పెట్టారు.. కానీ,…