Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. మొదట జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన, జూలై 20, 2026న విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ చలో’ మోర్చాతో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల ఈ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పలువురు సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. కొందరు ప్రముఖులు స్వయంగా ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొనగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు తెలిపారు.
ఈ క్రమంలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం స్పందించాడు. “ప్రతి ఒక్క చిన్నారికి, విద్యార్థికి, పురుషుడికి, మహిళకు ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను నెరవేర్చుకునే హక్కు ఉండాలి. మీ సంక్షేమమే ఒక బలమైన భారత్కు ప్రాతిపదిక. మనమందరం కలిసి శ్రద్ధ, అవకాశాలు, ఆశలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవడానికి కృషి చేద్దాం. భారతదేశ భవిష్యత్తు కోసం పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు” అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన సందేశాన్ని పంచుకున్నాడు.
Also Read
మరోవైపు ఈ పేపర్ లీకేజీ అంశం పార్లమెంట్ను తీవ్రంగా కుదిపేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర మునిగిపోకలు సాగుతున్నాయి. ప్రత్యేక నిబంధనల కింద చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండగా, సాధారణ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉభయ సభల (లోక్సభ, రాజ్యసభ) కార్యకలాపాలు పదేపదే వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో జూలై 21న ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపునకు మోర్చాగా వెళ్లేందుకు యత్నించగా, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!