Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. మొదట జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన, జూలై 20, 2026న విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ చలో’ మోర్చాతో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల ఈ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పలువురు సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. కొందరు ప్రముఖులు స్వయంగా ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొనగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు తెలిపారు.
ఈ క్రమంలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం స్పందించాడు. “ప్రతి ఒక్క చిన్నారికి, విద్యార్థికి, పురుషుడికి, మహిళకు ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను నెరవేర్చుకునే హక్కు ఉండాలి. మీ సంక్షేమమే ఒక బలమైన భారత్కు ప్రాతిపదిక. మనమందరం కలిసి శ్రద్ధ, అవకాశాలు, ఆశలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవడానికి కృషి చేద్దాం. భారతదేశ భవిష్యత్తు కోసం పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు” అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన సందేశాన్ని పంచుకున్నాడు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
మరోవైపు ఈ పేపర్ లీకేజీ అంశం పార్లమెంట్ను తీవ్రంగా కుదిపేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర మునిగిపోకలు సాగుతున్నాయి. ప్రత్యేక నిబంధనల కింద చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండగా, సాధారణ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉభయ సభల (లోక్సభ, రాజ్యసభ) కార్యకలాపాలు పదేపదే వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో జూలై 21న ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపునకు మోర్చాగా వెళ్లేందుకు యత్నించగా, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!