ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దులు కరణం బలరాం.. ఏలూరి సాంబశివరావులు గెలిచారు. తర్వాత కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ ఇంచార్జ్ గా కరణం వెంకటేష్ కు భాద్యతలు అప్పగించారు.. నియోజకవర్గంలో ఆయనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేయటంతో వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ చీరాల నుంచి పోటీ…
కాంగ్రెస్ వ్యవహారం నచ్చక బీజేపీలో చేరిపోయారు మర్రి శశిధర్రెడ్డి. అదేదారిలో మరికొందరు ఉన్నట్లు టాక్. గ్రేటర్లో కాంగ్రెస్ బలహీన పడిందని.. రాజకీయ భవిష్యత్ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్కు లాయలిస్టులుగా పేరు ఉన్నవాళ్లే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ మారకుండా ఆపడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. మిగిలిన నాయకులు వెళ్లిపోకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్కు గ్రేటర్ హైదరాబాద్ లోనే…
నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను సవరించింది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ.…
TSPSC Group 4 Notification: వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో జంబో నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)… టీఎస్పీఎస్సీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. గ్రూప్-4 నోటిఫికేషన్ను ఇవాళ అధికారికంగా విడుదలైంది.. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అందులో అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44…
హైదరాబాద్ చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసుఫ్ గూడా చెందిన మేలపాటి చెంచు నాయుడు, హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్ నగర్ కు చెందిన రవికి నోటీసులు ఇచ్చింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన స్థానంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగనాథ్ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వ నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ ఎందుకు జరిగింది. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే బదిలీ…
రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో పాటు చలి తీవ్రత పెరుగుతోంది. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
IT Raids on Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డిపై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ రెండో రోజు ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి రేపు మరోసారి విచారణకు హాజరుకానున్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్ అరెస్ట్పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం…
Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసును విచారిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి కూతురు సునీత పిటిషన్పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.