Nellore Police: కష్టం ఏపీ పోలీసులది.. ఫలితం తెలంగాణ పోలీసులకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేరాలను అదుపుచేసేందుకు పోలీసులు ఎంతో శ్రమిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర రాష్ట్రాలకు కూడా వెళతారు. అయితే కొంతమంది కష్ట పడితే ఇతరులు ఆ క్రెడిట్ కొట్టేస్తారు. ఫలితం మరొకరిది అన్న చందంగా నెల్లూరు జిల్లా పోలీసు శాఖలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలో జరిగిన ఓ భారీ దొంగతనం కేసును నెల్లూరు పోలీసులు ఛేదిస్తుండగా.. తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల సమాచారం మా దగ్గర ఉందని, తామే విచారించి చోరీసొత్తు రికవరీ చేస్తామంటూ తెలంగాణకు తీసుకువెళ్లారు. దాంతో తమ శ్రమంతా వృథా అయిందని నెల్లూరు పోలీసులు గెత ఫీలవుతున్నారు. నెల్లూరు మిలిటరీ కాలనీలోని మైన్స్ విశ్రాంత జేడీ ఇంట్లో నెల కిందట భారీ దొంగతనం జరిగింది. ఆయన కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్లో స్థిరపడగా.. అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి వెళ్లేవారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన గుర్తుతెలియని దుండగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి వాటిని పగలగొట్టి లోనికి ప్రవేశించి బంగారు నగలు, నగదు చోరీ చేశారు. మొత్తం రూ. 1.75 కోట్ల విలువ చేసే సొత్తు అపహరణకు గురైందన్న ఫిర్యాదుపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
ఎస్పీ సీహెచ్ విజయారావు.. దర్గామిట్ట పోలీసులు, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును స్వయంగా పర్యవేక్షించారు. సీసీ టీవీల సాయంతో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. భీమవరానికి చెందిన ఇద్దరు పాత నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నెలతర్వాత దొంగలను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు రాజమహేంద్రవరం, భీమవరం తదితర ప్రాంతాల్లో గాలింపు మొదలుపెట్టారు. అయితే.. విశ్రాంత జేడీ కుమార్తె తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారి కావడంతో నెల్లూరులో చోరీ కేసు ఛేదించేందుకు అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు.
నెల్లూరు సీసీఎస్కు చెందిన ఓ పోలీసు అధికారి అత్యుత్సాహంతో నిందితుల సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు చేరవేశారు. దొంగలను తాము అదుపులోకి తీసుకున్నామని, నెల్లూరు ప్రత్యేక బృందాలు వెనక్కు వెళ్లిపోవచ్చని చెప్పడం గమనార్హం. అక్కడి పోలీసులకు సమాచారం చేరవేసిన సీసీఎస్ అధికారిపై నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి.. విచారణకు ఆదేశించారు. తాము కష్టపడితే తెలంగాణ పోలీసులు దానిని ఎగరేసుకుపోయారని నెల్లూరు పోలీసులు ఆవేదన చెందుతున్నారు.
Read Also: Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!