Nellore Police: కష్టం ఏపీ పోలీసులది.. ఫలితం తెలంగాణ పోలీసులకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేరాలను అదుపుచేసేందుకు పోలీసులు ఎంతో శ్రమిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర రాష్ట్రాలకు కూడా వెళతారు. అయితే కొంతమంది కష్ట పడితే ఇతరులు ఆ క్రెడిట్ కొట్టేస్తారు. ఫలితం మరొకరిది అన్న చందంగా నెల్లూరు జిల్లా పోలీసు శాఖలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలో జరిగిన ఓ భారీ దొంగతనం కేసును నెల్లూరు పోలీసులు ఛేదిస్తుండగా.. తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల సమాచారం మా దగ్గర ఉందని, తామే విచారించి చోరీసొత్తు రికవరీ చేస్తామంటూ తెలంగాణకు తీసుకువెళ్లారు. దాంతో తమ శ్రమంతా వృథా అయిందని నెల్లూరు పోలీసులు గెత ఫీలవుతున్నారు. నెల్లూరు మిలిటరీ కాలనీలోని మైన్స్ విశ్రాంత జేడీ ఇంట్లో నెల కిందట భారీ దొంగతనం జరిగింది. ఆయన కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్లో స్థిరపడగా.. అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి వెళ్లేవారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన గుర్తుతెలియని దుండగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి వాటిని పగలగొట్టి లోనికి ప్రవేశించి బంగారు నగలు, నగదు చోరీ చేశారు. మొత్తం రూ. 1.75 కోట్ల విలువ చేసే సొత్తు అపహరణకు గురైందన్న ఫిర్యాదుపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఎస్పీ సీహెచ్ విజయారావు.. దర్గామిట్ట పోలీసులు, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును స్వయంగా పర్యవేక్షించారు. సీసీ టీవీల సాయంతో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. భీమవరానికి చెందిన ఇద్దరు పాత నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నెలతర్వాత దొంగలను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు రాజమహేంద్రవరం, భీమవరం తదితర ప్రాంతాల్లో గాలింపు మొదలుపెట్టారు. అయితే.. విశ్రాంత జేడీ కుమార్తె తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారి కావడంతో నెల్లూరులో చోరీ కేసు ఛేదించేందుకు అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు.
నెల్లూరు సీసీఎస్కు చెందిన ఓ పోలీసు అధికారి అత్యుత్సాహంతో నిందితుల సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు చేరవేశారు. దొంగలను తాము అదుపులోకి తీసుకున్నామని, నెల్లూరు ప్రత్యేక బృందాలు వెనక్కు వెళ్లిపోవచ్చని చెప్పడం గమనార్హం. అక్కడి పోలీసులకు సమాచారం చేరవేసిన సీసీఎస్ అధికారిపై నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి.. విచారణకు ఆదేశించారు. తాము కష్టపడితే తెలంగాణ పోలీసులు దానిని ఎగరేసుకుపోయారని నెల్లూరు పోలీసులు ఆవేదన చెందుతున్నారు.
Read Also: Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!