మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వచ్చే ఆదివారం హైదరాబాద్లో బోనాల పండుగ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Hyderabad Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కురుస్తాయని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష హెచ్చరిక జారీ చేసింది.
టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు.
Secret Camera: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ ఇంటి యజమాని దారుణానికి ఒడిగట్టాడు. ఇంటిని అద్దెకు ఇచ్చి ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. గదిని అద్దెకు తీసుకున్న యువతులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతడి వికృత రూపం బయటపడింది.
Tirupathi: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి హైదరాబాద్-తిరుపతి రూట్లలో డైనమిక్ టికెట్ ధరల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఆన్ లైన్ గేమ్ లు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తాయో నిత్యం వింటూనే ఉన్నాం.. ఆడ, మగ తేడా లేకుండా అందరు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతుంది..పక్కింట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చోరికి పాల్పడింది.. అనుమానంతో పోలీసులు విచారించగ అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది.. రామంతాపూర్ ఇందిరానగర్…
ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం…
సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు.