V. Hanumantha Rao: బీసీలను కాంగ్రెస్ పార్టీ ఏకం చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో 54 శాతం బీసీలు ఉన్నాం.. ప్రత్యేక మంత్రి శాఖను కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరామని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంత రావు అన్నారు. అయినా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. బీసీ గర్జన నిర్వహణ కోసం బీసీలను చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళాను అని వీహెచ్ పేర్కొన్నారు. నేను ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించాను.. బీసీల నుంచి మంచి స్పందన వచ్చింది అని హనుమంతరావు అన్నారు.
Read Also: Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం
Also Read
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కుల గణన చేస్తామని హామీ ఇచ్చారు అని హనుమంత రావు అన్నారు. రెండుసార్లు ప్రధాని మోడీని కలిసినా ప్రయోజనం లేదు.. నిన్న పీసీసీని భట్టి విక్రమార్క, మధుయాష్కీలను కలిశాను.. సెప్టెంబర్ 6th తర్వాత సభ పెట్టేందుకు సమయం తీసుకోవాలని వారు సూచించారు అని వీహెచ్ తెలిపారు. ఈ బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ముఖ్య అతిధిగా వస్తారు.. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన వెల్లడించారు.
Read Also: Viral Video: రోడ్డు దాటేందుకు పాము కష్టాలు.. చప్పట్లు కొడుతూ సాయం
కాంగ్రెస్ ను చూసి మిగిలిన పార్టీలు కూడా బీసీల వైపు మొగ్గు చూపుతున్నాయి అని వీహెచ్ అన్నారు. సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు.. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం.. కనీసం రెండు లక్షలతో సభ పెడతాం అని హనుమంత రావు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడుకి గన్మెన్లను తొలిగించారు.. జాతీయ పార్టీ నాయకుడికి భద్రత లేకుండా చెయ్యడంలో ఆంతర్యం ఏమిటి.. రాష్ట్రం అంతా తిరిగే మా పీసీసీకి ఏదైనా జరిగితే బాధ్యత ఎవ్వరిది అని వీహెచ్ ప్రశ్నించారు. తక్షణమే నాకు మా పీసీసీ అధ్యక్షుడుకి భద్రత కల్పించాలి అని వి. హనుమంత రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!