Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
- హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం
- కమిషనర్ రంగనాథ్కు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lothukunta Land Case: హైదరాబాద్లోని లోతుకుంట భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి తీవ్రస్థాయిలో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరించడంపై హైకోర్టు ధర్మాసనం హైడ్రా (HYDRAA) తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విచారణకు హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైఖరిపై న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు
విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “రెవెన్యూ, నీటిపారుదల (ఇరిగేషన్) చట్టాలను పక్కనబెట్టి కేవలం హైడ్రా చట్టం ఒక్కటే ఉందా?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు ఒక అలవాటుగా మారిపోయిందని ధర్మాసనం మండిపడింది. ఒకే భూమికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం అనేది కోర్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేదని స్పష్టం చేసింది.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
కోర్టు ఆదేశాలు లెక్కచేయకపోవడం తీవ్ర నేరం
కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఉన్నత స్థానాల్లో అప్పీలు చేయకుండా, మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్రమైన నేరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒక సాధారణ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లోతుకుంట భూముల్లోకి ఎలా వెళ్తారని హైడ్రా అధికారులను ప్రశ్నించింది.
కమిషనర్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును సమయం కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!