Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
- హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం
- కమిషనర్ రంగనాథ్కు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lothukunta Land Case: హైదరాబాద్లోని లోతుకుంట భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి తీవ్రస్థాయిలో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరించడంపై హైకోర్టు ధర్మాసనం హైడ్రా (HYDRAA) తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విచారణకు హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైఖరిపై న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు
విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “రెవెన్యూ, నీటిపారుదల (ఇరిగేషన్) చట్టాలను పక్కనబెట్టి కేవలం హైడ్రా చట్టం ఒక్కటే ఉందా?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు ఒక అలవాటుగా మారిపోయిందని ధర్మాసనం మండిపడింది. ఒకే భూమికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం అనేది కోర్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేదని స్పష్టం చేసింది.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
కోర్టు ఆదేశాలు లెక్కచేయకపోవడం తీవ్ర నేరం
కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఉన్నత స్థానాల్లో అప్పీలు చేయకుండా, మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్రమైన నేరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒక సాధారణ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లోతుకుంట భూముల్లోకి ఎలా వెళ్తారని హైడ్రా అధికారులను ప్రశ్నించింది.
కమిషనర్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును సమయం కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!