హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు,నాళాలు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్ లోని స్థలాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కబ్జాదారుల నుంచి వందల కోట్ల విలువైన భూములను రక్షిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడను తొలగించింది. 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు…
భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. వరద తాకిడికి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్1790 అడుగులు కాగా.. 1789.25 అడుగులకు చేరిన నీటిమట్టం.. హిమాయత్ సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా.. ప్రస్తుతం 1762.80 అడుగులకు చేరిన నీటిమట్టం..6 గేట్లు 5 అడుగుల మేర తెరిచి 3072 క్యూసెక్కుల నీటిని ఉస్మాన్ సాగర్…
అసాంఘిక కార్యాకలాపాలకు శ్మశాన వాటికను అడ్డాగా మార్చుకుంది ఓ మహిళ. శ్మశానంలోని గదిలో వ్యభిచార దందా నడుపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తోంది. శ్మశానంలో అయితే ఎవరికీ అనుమానం కలుగదని భావించింది. కానీ తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే కదా.. ఈ క్రమంలో విషయం తెలిసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనఖీలు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పరిధిలోని శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చింది ఓ మహిళ.…
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వాన పడుతోంది. కాగా భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ రెండు జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి బ్రిడ్జి మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్…
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో ఇంకా…
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. మనసు ఒక చోట మనిషి మరో చోట అన్నట్టు ఉంది అయన పరిస్థితి. ప్రస్తుతం ఆయన తనలో తాను స్ట్రగుల్ అవుతున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట పరిశీలకులకు. తానొకటి తలుస్తుంటే వెనకున్న శక్తులు మరోటి చేస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ రాజకీయంలో ఎక్కువ భాగం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు.
చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?. చర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15…
కేటీఆర్ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్ను కలిశానన్న ఆయన.. కేటీఆర్ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.