Chitti Scam: జనాల అమాయకత్వమే వారికి పెట్టుబడి. దాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల వ్యాపారం పేరుతో అందిన కాడికి దండుకుని బిచాణా ఎత్తేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు. అలాంటి ఘటనే హైదరాబాద్ శంషాబాద్లో జరిగింది. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు కొట్టేశారు దంపతులు. వారి దగ్గర నమ్మి చిట్టీలు వేసిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇలాగే ప్రచారం చేస్తారు కొంత మంది. డబ్బులు తీసుకుంటారు.. చిట్టీలు నడిపిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్.. ఆ డబ్బులతో ఉడాయిస్తారు.…
తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది. Also…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. Also Read:Ilayaraja: ఇళయరాజాతో పెట్టుకుంటే.. తిప్పలు తప్పవా? “హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు”…
Hyderabad: నేరస్తులు.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. నేరాలకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఇటీవల అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కానీ అక్కడే నేరస్తులు ఓ డెడ్ బాడీని సంచిలో తీసుకు వచ్చి పడేసి.. తాపీగా ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయారు. అసలు చనిపోయిన మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే అక్కడి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి…
వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పై ఐటి సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్ కు వాసవి సంస్థ అనుబంధంగా ఉన్నట్లు గుర్తించారు. వాసవి సంస్థలో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు నిర్వహించింది ఐటీశాఖ. క్యాప్స్ గోల్డ్ లో కూడా అభిషేక్, సౌమ్య డైరెక్టర్ గా ఉన్నారు.. వాసవికి సంబంధించిన 40 కంపెనీలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పైన ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ.. చందా…
హైదరాబాదులో మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కోట్లలో వసూలు చేసి భారీ మోసానికి పాల్పడింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టిఅన్నారంలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలు చేసి బురిడీ కొట్టించింది. కోట్ల రూపాయల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ.. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండీ శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు.. మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు..…
హైదరాబాద్ లో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యాపారం చేసే బిజినెస్మెన్లే టార్గెట్గా ఐటి దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై దాడులు చేశారు ఐటి శాఖ అధికారులు.. బంగారం హోల్సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపారంపై దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ డీటెయిల్స్ తీసుకున్నారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై పలు…
తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది.. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం.. ప్రపంచఉద్యమాల చరిత్రలో…
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువతిని రేప్ చేసి ఆ పై హత్య చేసి దిగంబరిగా పడేశారు దుండగులు. పూర్తిగా కుళ్లిన స్థితిలో మృతదేహం గుర్తించారు. యువతి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రాజేంద్రనగర్ పోలీసులు. Also Read:Fraud: చిట్టీలు వేస్తున్నారా?…
దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లుగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ సొమ్ముతో పరారయ్యాడు ఓ ఘనుడు. లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలతో పారిపోయాడు. శంషాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు పల్లెమోని సురేందర్. చిట్టీల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. రూ. 5 కోట్లకు పైగా జనాలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా పారిపోయాడు పల్లెమోని సురేందర్. విషయం తెలుసుకున్న…