బైక్తో కారును చిన్న డ్యాష్ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టింది ఓ గ్యాంగ్! పోనీ యువకుడిదే తప్పా అంటే.. అదీ కాదు. కారులోని వ్యక్తి దిగి యువకుడిని కొడుతుండగానే.. అక్కడే ఉన్న స్థానికులు కూడా మా అన్న కారుకే డ్యాష్ ఇస్తావా అంటూ క్రికెట్ బ్యాట్లతో చావబాదారు. బండ్లగూడ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఊరుకోలేదు.. వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆ గ్యాంగ్ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు తీసిన…
హైదరాబాద్లో కబ్జారాయుళ్లు హడలెత్తిస్తున్నారు. ఖాళీ స్థలాల కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ఆస్తులే టార్గెట్గా కబ్జాలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలా ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం.…
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది.…
తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వరదల కారణంగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతారంయ ఏర్పడింది. ఇక ఇప్పుడు నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు అధికారులు. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మంచిరేవుల బ్రిడ్జి పైనుంచి మూసీ నది…
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్…
బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటికి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ తో పాటు మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. డగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను గుర్తించింది ఈగల్ టీమ్. కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న విద్యార్థులు.. మణిపూర్కు చెందిన విద్యార్థి నోవెల్ల కీలక సూత్రధారిగా గుర్తింపు.. నోవెల్ల తో పాటు మరో విద్యార్థి అశర్ జావెద్…
డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తోంది. డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. డ్రగ్స్ కు అలవాటు పడి యువకులు, విద్యార్థులు తమ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. నిన్న మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. విద్యార్థులు…
మాదాపూర్ లో పోకిరీల కిరాతకం వెలుగుచూసిన విషయం తెలిసిందే. బైక్ పై వెళ్తున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు పోకిరీలు. ముగ్గురు పోకిరీలు బైక్ పై ప్రయాణిస్తూ అమ్మాయి బ్యాక్ సైడ్ టచ్ చేసి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికురాలు పోకిరీల ఆగడాలపై వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ముగ్గురు పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్…
జగద్గిరిగుట్ట యస్బెస్టస్ కాలనిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఒరిస్సా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీలసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. సిలిండర్ పేలడంతో కాలనీ వాసులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా భయానక…