ఆరు సార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఇప్పుడు రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆర్థిక మంత్రి హరీష్రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్రావు మాట్లాడుతూ.. మోత్కులగూడెం 90శాతం టీఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు.. 18 ఏళ్లలో మీకు ఈటల చేయని పని, మీ…
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోంది. సహజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ బైపోల్ నిర్వహణలో ఈవీఎంలను ఉపయోగిస్తారా? లేదంటే బ్యాలెట్ పద్దతా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్గా మారింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..తమ డిమాండ్లు హైలైట్ అయ్యేలా వివిద వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు,…
దళిత బంధు పై కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తాము. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నాం అని తెలిపారు. హుజూరాబాద్ నుండి సైదాపూర్ రోడ్డు కు అరు కోట్ల తో పనులు ప్రారంభం ఉన్నాయి. ఆరు సార్లు గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు అభివృద్ది చేయలేదు. కరీంనగర్ లో వేసిన రోడ్ల లాగా హుజూరాబాద్ రోడ్లను అధునికరిస్తం అని…
గత మూడు నెలలుగా హుజూరాబాద్లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన…
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిర్మల్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసిన ఆయన… మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు అమిత్ షా. నిర్మల్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. కేసీఆర్ను టార్గెట్ చేశారు. అధికారం కారుదే అయినా.. స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమన్నారు.తెలంగాణలో బీజేపీ బలం అంతకంతకూ…
హుజురాబాద్లో కుల సంఘాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందా? వారు ఏం అడిగితే దానికి ఓకే చెప్పేస్తున్నారా? హామీల వర్షం కురుస్తోందా? ఈ విషయంలో అధికారపార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చేంటి? ఒక్కోరోజు నలుగురు లేదా ఐదుగురు మంత్రుల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక తేదీ ప్రకటన ఇప్పట్లో లేకపోయినా.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడానికి పార్టీలకు బోల్డంత సమయం చిక్కింది. ఈ టైమ్ను అధికారపార్టీ టీఆర్ఎస్ చక్కగా ఉపయోగించుకుంటోందట. హుజురాబాద్ ఉపఎన్నిక తమకు పెద్ద విషయమే కాదని స్టేట్మెంట్లు…
హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు…
హుజురాబాద్ పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పట్టణంలో ఎకరం భూమిలో కోటి రూపాయలతో జయశంకర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం శుభ దినం. ఏడాది లోగా భవనం అందిస్తాం. ప్రభుత్వపరంగా ఏనాడైనా మాజీ మంత్రి సంఘ భవనం ఇచ్చిందా.. కళ్యాణ లక్ష్మీ దండగ అణా మాజీ మంత్రికి ఓటు వేద్దామా… కాంగ్రెస్ కనుమరుగైంది… హుజురాబాద్ లో బొట్టుబిళ్లకు,లక్ష రూపాయల కల్యాణ లాక్షికి పోటీ జరుగుతుంది. బిసిల జనగణన జరగాలి అన్న కేంద్రంలో…
అధికార పార్టీలో ఉన్నా.. అనుకోని పరిస్థితుల్లో మరో పార్టీలోకి చేరినా.. తన రూటే సెపరేటు.. అని ఇతరులు అనేలా నడుచుకుంటున్నారు.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. కొంత కాలం క్రితం వరకూ.. గులాబీ జెండా మోసి.. అజెండానూ అమలు చేసిన ఆయన.. అనుకోని పరిస్థితిలో కమలం బాట పట్టారు. కాషాయం గూటికి చేరారు. కానీ.. తన ఒరిజినాలిటీ మాత్రం కోల్పోయేది లేదు.. అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒక్కసారి.. ఈటల టీఆర్ఎస్ నుంచి…