మూగబోయిన హుజూరాబాద్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడు నెలలుగా హుజూరాబాద్లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది.
ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన ఖరీదైన కార్లు హుజూరాబాద్ను వదలిపోవటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఈ ప్రచార సందడి నుండి వారికి కొంత ఉపశమనం కలిగినట్టయింది.
Also Read
బీజేపీ అభ్యర్థిగా బావిస్తున్న ఈటల రాజేందర్, ఆ పార్టీ ఎన్నికల ఇంచార్జీ జితేందర్ రెడ్డితో పాటు వేలాది మంది మద్దతుదారులు నిర్మల్లో జరిగిన అమిత్ షా బహిరంగ సభకు తరలివెళ్లారు. అంతకు ముందు ఈటల తెలంగాన విమోచన దినం సందర్భంగా జమ్మికుంటలో త్రివర్ణ పతాకం ఎగరేశారు. కేసీఆర్ది నియంతృత్వ పాలన అంటూ విమర్శించారు. కేసేయార్ నియంతృత్వ పాలన అంతం హుజూరాబాద్ నుంచే ప్రారంభం కావాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
మరోవైపు, ప్రచారంలో మునిగివున్న టీఆర్ఎస్ మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. కాగా ఆర్థిక మంత్రి హరీష్ రావు జీఎస్టీ మీటింగ్ కోసం వెళ్లారు. టీఆర్ఎస్ ప్రచార బృందానికి ఆయనే సారధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే దారులన్నీ గజ్వేల్ వైపు మళ్లాయి. ఆ పార్టీ క్యాదర్ అంతా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాల సభకు వెళ్లారు. అయితే నేతలంతా తిరిగి ఒకటి రెండు రోజుల్లో మళ్లీ ప్రచారం పాల్గొనే అవకాశం ఉంది.
మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలన్నీ దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్నన్ హామీ ఇచ్చారు. జమ్మికుంట మండలంలోని నాగునూరు, హుజారాబాద్ మండలంలోని రాజాపూర్లో జరిగిన దళిత బంధు సర్వేని కలెక్టర్ శుక్రవారం పరీశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు తెలంగాణ దళిత బంధు పేరుతో కొత్త ఖాతాలు తెరవాలని ఆయన బ్యాంకులకు సూచించారు. డబ్బు మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మరింత లాభదాయకమైన యూనిట్లను స్థాపించడం ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారాయన. లబ్ధిదారులు తమకు సొంత భూమి ఉంటే అందులో పాడి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ చెప్పిన దానిని బట్టి హుజూరాబాద్లో దళితబంధు పథకం అమలు జోరుగా సాగుతుందని తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది!!
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!