మూగబోయిన హుజూరాబాద్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడు నెలలుగా హుజూరాబాద్లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది.
ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన ఖరీదైన కార్లు హుజూరాబాద్ను వదలిపోవటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఈ ప్రచార సందడి నుండి వారికి కొంత ఉపశమనం కలిగినట్టయింది.
Also Read
బీజేపీ అభ్యర్థిగా బావిస్తున్న ఈటల రాజేందర్, ఆ పార్టీ ఎన్నికల ఇంచార్జీ జితేందర్ రెడ్డితో పాటు వేలాది మంది మద్దతుదారులు నిర్మల్లో జరిగిన అమిత్ షా బహిరంగ సభకు తరలివెళ్లారు. అంతకు ముందు ఈటల తెలంగాన విమోచన దినం సందర్భంగా జమ్మికుంటలో త్రివర్ణ పతాకం ఎగరేశారు. కేసీఆర్ది నియంతృత్వ పాలన అంటూ విమర్శించారు. కేసేయార్ నియంతృత్వ పాలన అంతం హుజూరాబాద్ నుంచే ప్రారంభం కావాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
మరోవైపు, ప్రచారంలో మునిగివున్న టీఆర్ఎస్ మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. కాగా ఆర్థిక మంత్రి హరీష్ రావు జీఎస్టీ మీటింగ్ కోసం వెళ్లారు. టీఆర్ఎస్ ప్రచార బృందానికి ఆయనే సారధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే దారులన్నీ గజ్వేల్ వైపు మళ్లాయి. ఆ పార్టీ క్యాదర్ అంతా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాల సభకు వెళ్లారు. అయితే నేతలంతా తిరిగి ఒకటి రెండు రోజుల్లో మళ్లీ ప్రచారం పాల్గొనే అవకాశం ఉంది.
మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలన్నీ దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్నన్ హామీ ఇచ్చారు. జమ్మికుంట మండలంలోని నాగునూరు, హుజారాబాద్ మండలంలోని రాజాపూర్లో జరిగిన దళిత బంధు సర్వేని కలెక్టర్ శుక్రవారం పరీశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు తెలంగాణ దళిత బంధు పేరుతో కొత్త ఖాతాలు తెరవాలని ఆయన బ్యాంకులకు సూచించారు. డబ్బు మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మరింత లాభదాయకమైన యూనిట్లను స్థాపించడం ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారాయన. లబ్ధిదారులు తమకు సొంత భూమి ఉంటే అందులో పాడి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ చెప్పిన దానిని బట్టి హుజూరాబాద్లో దళితబంధు పథకం అమలు జోరుగా సాగుతుందని తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది!!
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!