హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈవీఎంల… లేదంటే బ్యాలేటా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోంది. సహజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ బైపోల్ నిర్వహణలో ఈవీఎంలను ఉపయోగిస్తారా? లేదంటే బ్యాలెట్ పద్దతా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్గా మారింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..తమ డిమాండ్లు హైలైట్ అయ్యేలా వివిద వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు పలు కుల సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయం ప్రకటించాయి.
అయితే ఇది ఇప్పుడే తేలే విషయం కాదు. ఈవీఎంలపై ఉప ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే పేపర్ బ్యాలెట్ పద్దతిలోనా అనే దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల విభాగం అధికారులు అంటున్నారు. అయితే ఏ పద్దతిని అనుసరించాలన్నది ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నోటాతో సహా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 385 మించకపోతే ఈవీఎంలను ఉపయోగిస్తారు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం పేపర్ బ్యాలెట్ తప్పదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 2018 లో జరిగిన ఎన్నికల్లో పది మంది అభ్యర్థులు పోటీ చేయగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీపడ్డారు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉండబోతోంది.
నాగార్జున సాగర్ ,దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈవీఎంలపై నిర్వహించగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు , 150 వార్డులకు ఎన్నికలు పేపర్ బ్యాలెట్లో జరిగాయి.
కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా 2019 లోకసభ ఎన్నికల్లో 170 మంది పసుపు రైతులు బరిలో నిలిచారు. తమ డిమాండ్లను హైలైట్ చేయటానికే వారు ఆ పనిచేశారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆమెపై విజయం సాధించారు. రెండేళ్ల తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీచేసే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఉన్నికల్లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 30 మంది నిరుద్యోగులు బరిలో దిగుతామని ప్రకటించారు. వీరు మాత్రమే గాక షర్మిల మద్దతుతో ఇంకా చాలా మంది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వీలైనంత ఎక్కువ మంది నామినేషన్లు వేయాలని షర్మిల ఇప్పటికు నిరుద్యోగులను కోరారు. నామినేషన్ వేస్తే పార్టీ తరఫున ఆర్థికంగా సాయం అందిస్తామని కూడా షర్మిల ప్రకటించారు. దీనిని బట్టి వచ్చే హుజూరాబాద్ బైపోల్స్ బ్యాలెట్ పద్దతిలో జరిగే అవకాశాలే ఎక్కువని అర్థమవుతోంది.
భూకబ్జా ఆరోపణలపై ఈటల రాజేందర్ని సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం ఈ ఎన్నికలకు దారితీసింది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో ఈ ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించారు. ఈటల ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఇంకా తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రాబోవు రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!