Formula E-Race Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడిన వెంటనే, ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రీన్కో సంస్థ , దాని అనుబంధ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తోడుగా, నిందితుల ఇళ్లపై సోదాలు చేపట్టేందుకు కోర్టు నుండి సెర్చ్ వారెంట్ను కూడా పొందింది. అయితే.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి…
కేటీఆర్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ.. కేటీఆర్ కోర్టు గుమ్మం తొక్కిన విషయంతెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. కేటీఆర్ అరెస్ట్పై స్టేను సైతం ఎత్తివేసింది. కోర్టు తీర్పులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రికి సూచించింది.
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఈడీని మాజీ మంత్రి కేటీఆర్ సమయం కోరారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు టైం ఇవ్వాలని ఆయన కోరారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ జరగనుంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. రేపటితో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగియనున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ కోర్టును మరోసారి కోరనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ సమాధానమిచ్చారు.
Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్పై దాడి కేసులో ఇప్పటికే మోహన్బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్బాబు ముందస్తు బెయిల్ పిటిషన్…
ఛత్తీస్గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు వెలువరించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫీలియా) అత్యంత హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం చట్టంలో ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదని కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.