Formula E Car Race Case : కేటీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. దూకుడు పెంచిన ఏసీబీ
- కేటీఆర్కి హైకోర్టులో ఎదురు దెబ్బ
- కేటీఆర్ అరెస్ట్పై స్టే ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ.. కేటీఆర్ కోర్టు గుమ్మం తొక్కిన విషయంతెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. కేటీఆర్ అరెస్ట్పై స్టేను సైతం ఎత్తివేసింది. కోర్టు తీర్పులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రికి సూచించింది.
అసలు ఏంటి ఈ కేసు?
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు చెందిన రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ ట్రాక్ పై దూసుకెళుతూ హైదరబాదీలను అలరించాయి. ఈ రేసు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ టికెట్లను బుక్ మై షో ద్వారా అమ్మారు. సామాన్య ప్రజలు టికెట్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఇలా హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ కారు రేసును నిర్వహించారు. ఈ రేసుకు అనుమతి నుంచి ఏర్పాట్ల వరకు అంతా కేటీఆర్ చూశారు. అందులో భారీ అవినీతి జరిగిందనేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వాదన.
ఎఫ్ఈవో రూ.55 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏ ..
2023 ఆరంభంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్ కావడంతో 2024 లో కూడా దీన్ని నిర్వహించేందుకు గత ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని ఆరోపించింది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బీఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది. గవర్నర్ అనుమతి తీసుకుని మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. 2024 లో మరోసారి ఫార్ములా ఈ రేసు నిర్వహించేందుకు ముందస్తుగా ఇచ్చిన రూ.55 కోట్లపై ఏసీబీ విచారణ చేపట్టింది.
దూకుడు పెంచిన ఏసీబీ..
ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని… ఇందులో కేటీఆర్ కీలక పాత్ర పోషించాడని ఏసీబీ అనుమానించింది. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి ని ఏ3 గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, నమోదు చేసిన కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టేశారు. ప్రస్తుతం కేసును అటు ఏసీబీ ఇటు ఈడీ రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా దూకుడు పెంచిన ఏసీబీ విచారణకు రావాలని మాజీ మంత్రిని కోరింది. దీంతో మాజీ మంత్రి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టుకు చేరుకున్నా్రు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు.. తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఏసీబీని సూచించింది. తాజాగా తుది తీర్పు వెలువడింది. ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వేచి చూడాలి?
READ MORE: Vizag Railway Zone: దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..