KTR: ఈడీ విచారణపై కేటీఆర్ రిక్వెస్ట్.. అప్పటి వరకు సమయం ఇవ్వాలని వినతి
- ఈడీ విచారణపై కేటీఆర్ రిక్వెస్ట్
- కోర్టు తీర్పు వరకు సమయం ఇవ్వాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఈడీని మాజీ మంత్రి కేటీఆర్ సమయం కోరారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు టైం ఇవ్వాలని ఆయన కోరారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ పిటిషన్పై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
ఇది కూడా చదవండి: HMPV Virus: భారతీయుల్లో HMPV వైరస్కి ‘‘రోగనిరోధక శక్తి’’.. నిపుణుల ప్రకటన..
Also Read
అయితే జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించారు. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: HMPV Virus: లాక్డౌన్ అంటూ వదంతులు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
ఇదిలా ఉంటే ఈ కేసులో విచారణకు సోమవారం ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. అక్కడ న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని నిలదీశారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి సోమవారం నోటీసులిచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunam Trailer: పండుగ ముందే తెచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!