PM Modi: గుజరాత్ గాంధీనగర్లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్షో నిర్వహించారు.
ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.
ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనమే కొట్టేసి పరారయ్యాడు. అదీ కూడా పోలీస్ స్టేషన్లోనే.. దర్జాగా పోలీస్ వాహనంలో పారిపోయిన సంఘటన గుజరాత్లోని ద్వారకాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దొంగను గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు. వివరాలు.. గుజరాత్కు చెందిన మోహిత్ శర్మ బైక్పై ద్వారకా వచ్చాడు. ఈ క్రమంలో ద్వారక పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ పార్క్ చేశాడు. ఆ తర్వాత ద్వారక పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన…
Fake Toll Plaza: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంటికి కన్నాలు వేసే పద్ధతిలో నేరాలు జరగడం లేదు. ఇప్పుడంతా సైబర్ దాడులు, టెక్నాలజీ ఆధారిత మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే గుజరాత్లో జరిగిన ఓ నేరం గురించి తెలిస్తే, మోసగాళ్లు ఎంతగా తెలివిగా ప్లాన్ చేశారో తెలుస్తోంది. ఏకంగా ఓ హైవే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించి నకిలీ టోల్ప్లాజాను ఏర్పాటు చేసుకుని దర్జాగా ఏడాదిన్నర పాటు దోపిడీ చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం…
India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.
గుండెపోటు కారణంగా గుజరాత్లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్ ఎటాక్తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
గుజరాత్ దారుణం చోటు చేసుకుంది. ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం గుజరాత్లోని ఖేడా జిల్లా నడియాడ్లో జరిగింది.ఆ సిరప్లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలిసినట్టు బాధితుల వైద్య పరీక్షలో వెల్లడైంది. దీంతో గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఓ షాప్ కల్మేఘాసవాసవ అరిష్ట అనే పేరుతో ఆయుర్వేదిక్ సిరప్ను విక్రయించగా..…
ఒకవైపు చలికాలం మొదలైన కూడా.. మరోవైపు భారీ వర్షాలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. గత కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తాజాగా గుజరాత్ లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనాలు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 251 తాలూకాల్లోని 230 తాలూకాలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.. నిన్న రాష్ట్రంలో…
20 Killed amid unseasonal rains lash Gujarat: ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ప్రాణ నష్టం కూడా జరిగింది. పిడుగులకు 20 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నేడు కూడా గుజరాత్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి అకాల వర్షాలతో గుజరాత్ అతలాకుతలమైంది. గుజరాత్లోని…