Fake Toll Plaza: గుజరాత్లో ఘరానా మోసం..ఏకంగా హైవేపై నకిలీ టోల్ ప్లాజా.. రూ. కోట్లు దోపిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Toll Plaza: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంటికి కన్నాలు వేసే పద్ధతిలో నేరాలు జరగడం లేదు. ఇప్పుడంతా సైబర్ దాడులు, టెక్నాలజీ ఆధారిత మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే గుజరాత్లో జరిగిన ఓ నేరం గురించి తెలిస్తే, మోసగాళ్లు ఎంతగా తెలివిగా ప్లాన్ చేశారో తెలుస్తోంది. ఏకంగా ఓ హైవే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించి నకిలీ టోల్ప్లాజాను ఏర్పాటు చేసుకుని దర్జాగా ఏడాదిన్నర పాటు దోపిడీ చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన గుజరాత్ లోని బమన్ బోర్-కచ్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అయితే జాతీయరహదారిని బైపాస్ చేసే రోడ్డుపై ఓ ప్రైవేట్ ల్యాండ్లో టోల్ ప్లాజా ఏర్పాటు చేసి, హైవేపై వసూలు చేస్తున్న టోల్లో సగం డబ్బులు వసూలు చేస్తున్నారు. మోర్బీ జిల్లాలో ఈ బైపాస్ రోడ్డును నిర్మించి, ఏకంగా ఏడాదిన్నర పాటు టోల్ వసూలు చేసి కోట్ల రూపాయలను కోల్లగొట్టారు.
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
READ ALSO: IT Raids: కాంగ్రెస్ ఎంపీపై ఐటీ దాడులు.. ఏకంగా రూ.100 కోట్ల నగదు స్వాధీనం..
వివరాల్లోకి వెళితే మోర్బీ -కచ్ జిల్లాలను కలిపే 8ఏ నేషనల్ హైవేపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఈ టోల్ ప్లాజాకు తగలకుండా.. ఓ బైపాస్ రోడ్డు ఉండేది. టోల్ ఛార్జీలు తగలకుండా వాహనదారులు ఈ రోడ్డును వినియోగించే వారు. అయితే దీన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్ కంపెనీని అద్దుకు తీసుకుని దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డు నిర్మించి ఫ్యాక్టరీలోనే టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. అయితే హైవేతో పోలిస్తే.. నకిలీ టోల్ ప్లాజాలో తక్కువ డబ్బులు వసూలు చేస్తుండటంతో దీనిపై వాహనదారులు కూడా ఫిర్యాదు చేయలేదు.
ఇటీవల ఈ వ్యవహారంపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో ఈ నకిలీ వ్యవహారం గుట్టురట్టైంది. ఈ మోసంలో ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ యజమాని అమర్షి పటేల్, వనరాజ్ సింగ్ ఝాలా, హర్విజయ్ సింగ్ ఝాలా, ధర్మేంద్ర సింగ్ ఝాలా, యువరాజ్ సింగ్ ఝాలా మరియు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న మోర్బి జిల్లా కలెక్టర్ జీటీ పాండ్యా తెలిపారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!