Fake Toll Plaza: గుజరాత్లో ఘరానా మోసం..ఏకంగా హైవేపై నకిలీ టోల్ ప్లాజా.. రూ. కోట్లు దోపిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Toll Plaza: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంటికి కన్నాలు వేసే పద్ధతిలో నేరాలు జరగడం లేదు. ఇప్పుడంతా సైబర్ దాడులు, టెక్నాలజీ ఆధారిత మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే గుజరాత్లో జరిగిన ఓ నేరం గురించి తెలిస్తే, మోసగాళ్లు ఎంతగా తెలివిగా ప్లాన్ చేశారో తెలుస్తోంది. ఏకంగా ఓ హైవే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించి నకిలీ టోల్ప్లాజాను ఏర్పాటు చేసుకుని దర్జాగా ఏడాదిన్నర పాటు దోపిడీ చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన గుజరాత్ లోని బమన్ బోర్-కచ్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అయితే జాతీయరహదారిని బైపాస్ చేసే రోడ్డుపై ఓ ప్రైవేట్ ల్యాండ్లో టోల్ ప్లాజా ఏర్పాటు చేసి, హైవేపై వసూలు చేస్తున్న టోల్లో సగం డబ్బులు వసూలు చేస్తున్నారు. మోర్బీ జిల్లాలో ఈ బైపాస్ రోడ్డును నిర్మించి, ఏకంగా ఏడాదిన్నర పాటు టోల్ వసూలు చేసి కోట్ల రూపాయలను కోల్లగొట్టారు.
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
READ ALSO: IT Raids: కాంగ్రెస్ ఎంపీపై ఐటీ దాడులు.. ఏకంగా రూ.100 కోట్ల నగదు స్వాధీనం..
వివరాల్లోకి వెళితే మోర్బీ -కచ్ జిల్లాలను కలిపే 8ఏ నేషనల్ హైవేపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఈ టోల్ ప్లాజాకు తగలకుండా.. ఓ బైపాస్ రోడ్డు ఉండేది. టోల్ ఛార్జీలు తగలకుండా వాహనదారులు ఈ రోడ్డును వినియోగించే వారు. అయితే దీన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్ కంపెనీని అద్దుకు తీసుకుని దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డు నిర్మించి ఫ్యాక్టరీలోనే టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. అయితే హైవేతో పోలిస్తే.. నకిలీ టోల్ ప్లాజాలో తక్కువ డబ్బులు వసూలు చేస్తుండటంతో దీనిపై వాహనదారులు కూడా ఫిర్యాదు చేయలేదు.
ఇటీవల ఈ వ్యవహారంపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో ఈ నకిలీ వ్యవహారం గుట్టురట్టైంది. ఈ మోసంలో ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ యజమాని అమర్షి పటేల్, వనరాజ్ సింగ్ ఝాలా, హర్విజయ్ సింగ్ ఝాలా, ధర్మేంద్ర సింగ్ ఝాలా, యువరాజ్ సింగ్ ఝాలా మరియు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న మోర్బి జిల్లా కలెక్టర్ జీటీ పాండ్యా తెలిపారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!