Iran: ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న అమెరికాతో రెండు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ఈ కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ముందు పది ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో అతి ముఖ్యమైన ప్రతిపాదన హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవడం. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించింది. కానీ.. తాజాగా ఇరాన్ హర్మూజ్ను మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులపై నిరసన ముసివేసినట్లు స్పష్టం చేసింది. ఓ వైపు…
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత చేదాటుతున్నాయి. ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బహుశా రెండు వారాల్లో.. లేదంటే చాలా త్వరగా ఇరాన్తో యుద్ధం ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు.
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత 28 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీవ్రం అవుతోంది. ట్రంప్ చర్చలకు పిలుస్తున్నా.. ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరితో ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది.
వామ్మో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. యుద్ధ వార్తలు వింటేనే గుండె ఝళ్లుమంటోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది.
ఇరాన్పై ట్రంప్ వ్యూహం మారుతుందా? తాజాగా ఆయన ప్రణాళికలు మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది.