Iran-Hormuz: హార్ముజ్పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?
- హార్ముజ్పై ఇరాన్ సంచలన నిర్ణయం
- శత్రు దేశాలపై ఇరాన్ ప్రతీకారం
- హార్ముజ్ మూసేస్తున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత 28 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీవ్రం అవుతోంది. ట్రంప్ చర్చలకు పిలుస్తున్నా.. ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరితో ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది. అంతేకాకుండా తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Also Read
- Iran Vs America War: 3 నెలలు.. తె*గిపడ్డ వేలాది తలలు..అంతర్జాతీయ మీడియా షాకింగ్ నివేదిక!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
- US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హార్ముజ్ను మూసేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. శత్రువులతో కలిసుండే దేశాలకు ఏ మాత్రం అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన మూడు నౌకలను కూడా వెనక్కి పంపేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంలోని పౌరులు దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఇరాన్ సిద్ధపడుతోంది.
హార్ముజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక ఇరాన్ ప్రాధేయపడడంతోనే చర్చల కోసం ఐదు రోజులు దాడులు ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ గడువు కూడా ఏప్రిల్ 6 వరకు పెంచారు. కానీ ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా ఇరాన్ స్పందిస్తోంది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని.. అమెరికా భూతల దాడులు చేస్తే.. తాము కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక అధికారులంతా హతమయ్యారు. అంతేకాకుండా అనంతరం దాడుల్లో ఇరాన్లో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ కారణంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
-
Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! ‘పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం..
-
Telangana : దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
-
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
-
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!