Iran-Hormuz: హార్ముజ్పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?
- హార్ముజ్పై ఇరాన్ సంచలన నిర్ణయం
- శత్రు దేశాలపై ఇరాన్ ప్రతీకారం
- హార్ముజ్ మూసేస్తున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత 28 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీవ్రం అవుతోంది. ట్రంప్ చర్చలకు పిలుస్తున్నా.. ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరితో ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది. అంతేకాకుండా తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Also Read
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హార్ముజ్ను మూసేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. శత్రువులతో కలిసుండే దేశాలకు ఏ మాత్రం అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన మూడు నౌకలను కూడా వెనక్కి పంపేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంలోని పౌరులు దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఇరాన్ సిద్ధపడుతోంది.
హార్ముజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక ఇరాన్ ప్రాధేయపడడంతోనే చర్చల కోసం ఐదు రోజులు దాడులు ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ గడువు కూడా ఏప్రిల్ 6 వరకు పెంచారు. కానీ ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా ఇరాన్ స్పందిస్తోంది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని.. అమెరికా భూతల దాడులు చేస్తే.. తాము కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక అధికారులంతా హతమయ్యారు. అంతేకాకుండా అనంతరం దాడుల్లో ఇరాన్లో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ కారణంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!