Iran-US: రేపటితో ముగుస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం.. మళ్లీ మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్పదా?
- రేపటితో ముగుస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం
- అమెరికాతో చర్చలకు ఇరాన్ నిరాకరణ
- బెదిరిస్తే చర్చలు జరపబోమన్న ఇరాన్
- ఒప్పందం చేసుకోకపోతే దాడులుంటాయన్న ట్రంప్
- మళ్లీ మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తోంది. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. వాస్తవంగా మంగళవారం ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరగాల్సి ఉండగా నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో చర్చలు ఉండబోవని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా బెదిరిస్తోందని.. ఇలాంటి ధోరణి ఉన్నప్పుడు చర్చలు ఎలా జరుపుతామని ఇరాన్ పేర్కొంది. మరోవైపు హార్ముజ్ను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ నౌకలపై దాడులు చేయడంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది.
అయితే గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. బ్రిడ్జ్లు, విద్యుత్ ప్లాంట్లపై భీకర దాడులు ఉంటాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని.. మా పని కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలను చూస్తుంటే మరోసారి మధ్యప్రాచ్యంలో భీకర దాడులతో అట్టుడికే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేసేందుకు ఇరాన్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని చూశాయి. మరోసారి ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తే.. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ఉధృతం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్, చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మరోసారి పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే.. ప్రపంచ దేశాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. ట్రంప్ బెదిరింపులతో కాల్పుల విరమణ ఉల్లంఘనలతో దౌత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ లొంగదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే యుద్ధ భూమిలో కొత్త ఎత్తుగడలు వేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండానే అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి. దీంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. రెండో విడత చర్చల కోసం కూడా పాకిస్థాన్ ప్రయత్నించింది. సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించి ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖంగా లేనట్లుగా సమాచారం. చర్చలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో 24 గంటల తర్వాత మధ్యప్రాచ్యంలో ఏం జరగబోతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!