US-Iran Talks: 21 గంటల హై-లెవల్ మీటింగ్ ఫెయిల్.. చర్చలు విఫలమవ్వడానికి ప్రధానం కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Talks: ప్రస్తుతం ప్రపంచ దృష్టి అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలపై కేంద్రీకృతమై ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవ్వడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఏళ్లుగా నెలకొన్న అపనమ్మకం, ద్వేషాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య తీవ్రమైన నమ్మకలోపమే శాంతి ఒప్పందానికి అతిపెద్ద అడ్డంకిగా మిగిలిందని వాన్స్ తెలిపారు. సులభంగా చెప్పాలంటే, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఏ పక్షమూ మరొక పక్షాన్ని విశ్వసించడానికి సిద్ధంగా లేదని వాన్స్ వాదన.
READ MORE: Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్ కరువయ్యాయా?
Also Read
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
కొన్ని దశాబ్దాల తరువాత ఇరాన్, అమెరికా ముఖాముఖి చర్చలు జరిగాయి. పాకిస్థాన్ వేదికగా ఇరు దేశాలకు సంబంధించిన ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. 21 గంటల పాటు కొనసాగిన ఈ భేటీకి అమెరికా తరపున జెడి వాన్స్ స్వయంగా నాయకత్వం వహించారు. అయితే, ఇన్ని గంటల మథనం తర్వాత కూడా ఎటువంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. అయినప్పటికీ, ఇరాన్ ప్రతినిధులు కూడా ఈ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నారని, దౌత్య మార్గాలు ఇంకా మూసుకుపోలేదని వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లో పాకిస్థాన్లో మరోసారి ఇరు దేశాలు భేటీ అయ్యే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఈ కీలక చర్చలకు పాకిస్థాన్ ఒక ప్రధాన వారధిలా వ్యవహరిస్తోంది. రాబోయే రెండు రోజుల్లో ఇరు దేశాలు పాకిస్థాన్లో మళ్లీ సమావేశం కాగలవా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
చర్చలు ఎందుకు సఫలం కావడం లేదనే ప్రశ్న మొదలైంది. 21 గంటల పాటు జరిగిన చర్చలలో ఒప్పందం ఖరారు కాకుండా అడ్డుపడిన అసలు విషయం ఏమిటి? అనే సందేహం అందరిలో మెదులుతోంది. అయితే.. ఇక్కడ వచ్చిన సమస్యల్లా అణు కార్యక్రమమే. ఇరాన్ తన యురేనియం శుద్ధిని కనీసం 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతుంటే, ఇరాన్ మాత్రం కేవలం 5 ఏళ్లకు మించి అంగీకరించబోమని తెగేసి చెబుతోంది. ఈ ’15 ఏళ్ల అంతరమే’ ఒప్పందానికి ప్రధాన శత్రువుగా మారింది. దీనికి తోడు ఒకరి షరతులను మరొకరు ఎలా తనిఖీ చేయాలి, భవిష్యత్తులో హామీలు ఏమిటి అనే విషయాలపై కూడా స్పష్టత రాలేదు.
మరోవైపు.. విఫలమైన చర్చల ప్రభావం ఇప్పుడు సముద్రంలో కనిపిస్తోంది. పాకిస్థాన్లో చర్చలు విఫలమైన వెంటనే అమెరికా కఠిన వైఖరిని అవలంబించింది. హోర్ముజ్ జలసంధి గుండా ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను దిగ్బంధించింది. తన సైనిక శక్తిని, ఆర్థిక ఒత్తిడిని ఉపయోగించి ఇరాన్ను చర్చల బల్ల వద్దకు బలవంతంగా తీసుకురావాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిగ్బంధం ప్రపంచ చమురు సరఫరాలో సంక్షోభం మరింత తీవ్రమవుతుందనే భయాలను సైతం పెంచింది. ఒకవైపు చర్చల ఆశలు, మరోవైపు యుద్ధ మేఘాల మధ్య ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్ట దశలో నిలబడింది. పాకిస్థాన్ వేదికగా జరగబోయే తదుపరి పరిణామాలు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందో లేదో నిర్ణయించనున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!