US-Iran war: డెడ్లైన్కు ముందే ఇరాన్పై అమెరికా దాడులు.. తీవ్ర ఉద్రిక్తతలు
- డెడ్లైన్కు ముందే ఇరాన్పై అమెరికా దాడులు
- ఖర్గ్ ద్వీపం.. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడులు
- పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత చేదాటుతున్నాయి. ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై కూడా అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
ఇక ఇరాన్లో రైల్వే సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఇరానీయులు రైళ్ల ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే రైళ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ముందుగా స్టేషన్లు, రైలు సర్వీసులను నిలిపివేసింది.
ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా పలువురు కీలక నేతలు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ డెడ్లైన్ విధించారు. ఒప్పందం చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్ను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తాజాగా ఒప్పందం రద్దు కావడంతో డెడ్లైన్కు ముందుగానే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
Explosions reported in Kharg Island. pic.twitter.com/VazXgBPyHM
— Open Source Intel (@Osint613) April 7, 2026
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!