US-Iran war: డెడ్లైన్కు ముందే ఇరాన్పై అమెరికా దాడులు.. తీవ్ర ఉద్రిక్తతలు
- డెడ్లైన్కు ముందే ఇరాన్పై అమెరికా దాడులు
- ఖర్గ్ ద్వీపం.. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడులు
- పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత చేదాటుతున్నాయి. ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై కూడా అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ఇక ఇరాన్లో రైల్వే సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఇరానీయులు రైళ్ల ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే రైళ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ముందుగా స్టేషన్లు, రైలు సర్వీసులను నిలిపివేసింది.
ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా పలువురు కీలక నేతలు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ డెడ్లైన్ విధించారు. ఒప్పందం చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్ను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తాజాగా ఒప్పందం రద్దు కావడంతో డెడ్లైన్కు ముందుగానే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
Explosions reported in Kharg Island. pic.twitter.com/VazXgBPyHM
— Open Source Intel (@Osint613) April 7, 2026
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?