Trump: ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
- ఇరాన్తో యుద్ధంపై మారిన ట్రంప్ స్వరం
- వైట్హౌస్లో కీలక వ్యాఖ్యలు చేసిన అధ్యక్షుడు
- ఇరాన్ బెదిరింపులే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బహుశా రెండు వారాల్లో.. లేదంటే చాలా త్వరగా ఇరాన్తో యుద్ధం ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమించబోతుందని స్పష్టం చేశారు. యుద్ధం ముగించడానికి టెహ్రాన్తో దౌత్య ఒప్పందం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు.. అలాగే మాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం వాళ్లకు లేదని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే సామర్థ్యాన్ని లేకుండా చేస్తామని.. రాతియుగంలోకి నెట్టేస్తామని పేర్కొన్నారు. అప్పుడే అక్కడ నుంచి అమెరికా నిష్క్రమిస్తుందని తెలిపారు.
ఇతర దేశాలన్నీ కూడా ఎవరికి కావాల్సిన చమురు వాళ్లే తెచ్చుకోవాలన్నారు. ఇకపై అమెరికా సహాయం చేయదని స్పష్టం చేశారు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు స్వయంగా తమ నౌకలను పంపుకుని చమురు తెచ్చుకోవాలని ట్రంప్ సూచించారు.
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని టెహ్రాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలను తీవ్రతరం చేయవచ్చని వాషింగ్టన్ గతంలోనే హెచ్చరించింది. ఈ ఒప్పందంలోని కీలక డిమాండ్లలో అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని ఇరాన్ హామీ ఇవ్వడం, యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం వంటివి ఉన్నాయి. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ఒప్పందాలు ఉండవని.. త్వరలోనే యుద్ధం ముగిస్తామని ప్రకటించారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే కొన్ని రోజులు యుద్ధం కీలకమన్నారు. అవసరమైతే భూతల దాడుల వినియోగాన్ని కూడా తిరస్కరించలేమని తెలిపారు. మంగళవారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ..యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రకటనలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలు దెబ్బతినవచ్చని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా యుద్ధాన్ని ముగించడంపై టెహ్రాన్ తన వైఖరిని కఠినతరం చేస్తున్న తరుణంలో అమెరికా నుంచి ఇలాంటి సందేశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్ జజీరాతో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా నుంచి ప్రత్యక్ష సందేశాలు అందుతున్నప్పటికీ అవి చర్చల స్థాయికి చేరవని స్పష్టం చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తో మాత్రం తరచుగా పరోక్షంగానే సంభాషణలు జరిగాయని అరాఘ్చి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Russia: కూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి
తాజావార్తలు
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!