ఉక్రెయిన్ పై విరుచుపడుతోంది రష్యా. ఫిబ్రవరిలో ప్రారంభమై యుద్ధం ఐదు నెలలకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ముఖ్యంగా డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పట్టు సాధిస్తోంది. అక్కడి నగరాలను నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మరోసారి రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. గత మూడు వారాలుగా కీవ్ పై ఎలాంటి దాడి…
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు. జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది. ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి…
బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్ను కోల్పోయింది. జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ (38) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే యమక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో మూడో రౌండ్కు ముందు రింగ్లోనే యమక్ కుప్పకూలాడు. IPL 2022: అరగంట ఆలస్యంగా ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..? ఈ విషయాన్ని గమనించిన అక్కడి సిబ్బంది…
జర్మనీలో ప్రమాదవశాత్తు నీటిలోపడి గల్లంతైన కడారి అఖిల్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే. నన్నపనేని నరేందర్. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. వరంగల్ నగరం కరీమాబాద్ కి చెందిన కడారి పరశు రాములు, అన్నమ్మల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం జెర్మనీ కి వెళ్ళాడు. అయితే, 5 రోజుల క్రితం జెర్మనీలో జరిగిన ప్రమాదంలో నీటిలో మిస్…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్లో వున్నారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్తో మోదీ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య…
ఈ ఏడాది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెర్లిన్లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్…
రష్యా ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకూ మారిపోతున్నాయి. అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 16 న ఉక్రెయిన్పై దాడికి దిగే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారాయి. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమకు ఉక్రెయిన్పై దాడికి దిగే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదు. ఇక…
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు…
రోడ్డుపై వీసమెత్తు బంగారం కనిపిస్తేనే వదలరు. అలాంటిది ఏకంగా 186 కిలోల బంగారం కనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా చెప్పంది. అయితే, అంతపెద్ద మొత్తంలో ఒకే చోట ఉండటంతో చూసిన ప్రజలు షాక్ అయ్యారు. సూర్యకాంతిలో మెరిసిపోతున్న దానిని చూసి, ముట్టుకుంటూ ఫొటోలు దిగారు. 186 కిలోల 24 క్యారెట్ల బంగారంతో జర్మనీకి చెందిన నిక్లాస్ కాస్టెలో అనే ఆర్టిస్ట్ గోల్డెన్ క్యూబ్ను తయారు చేశాడు. ఈ గోల్డెన్ క్యూబ్ ను న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో ఉంచారు. అక్కడికి…