PM Modi: స్టార్టప్స్ లో మూడో స్థానం.. మొబైల్ తయారీలో రెండో స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు.
జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో భాగంగా మారాయని.. దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని.. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ కర్తవ్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని మోదీ అన్నారు. నేడు దేశంలోని ప్రతీ గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా ఉందని.. విద్యుత్, 99 శాతం గ్రామాలకు వంట గ్యాస్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇండియా గత రెండేళ్ల నుంచి 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోందని ఆయన వెల్లడించారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
గత శతాబ్ధంలో జర్మనీ, ఇతర దేశాలు పారిశ్రామిక విప్లవం నుంచి ప్రయోజనం పొందాయని.. భారత్ ఆ సమయంలో బానిసగా ఉందని, కానీ ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఇండియా వెనకబడి ఉండదని.. ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఇండియాలో స్టార్టప్స్ ఉండేవి కావని.. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉందని.. నేను మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ రెండోస్థానంలో ఉందని మోదీ వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. లక్ష్యం కన్నా ఐదు నెలల ముందే దీన్ని సాధించామని.. కోవిడ్ -19 సమయంలో భారత్ తమ ప్రజలకు టీకాలు వేయడానికి 10-15 ఏళ్లు పడుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయని.. నేడు 90 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ తీసుకున్నారని.. 95 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నవారు ఉన్నారని మోదీ వెల్లడించారు.
#WATCH LIVE via ANI FACEBOOK | PM Narendra Modi addresses members of the Indian community in Munich, Germanyhttps://t.co/fjNG1SiGCm
— ANI (@ANI) June 26, 2022
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!