PM Modi: స్టార్టప్స్ లో మూడో స్థానం.. మొబైల్ తయారీలో రెండో స్థానం
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు.
జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో భాగంగా మారాయని.. దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని.. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ కర్తవ్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని మోదీ అన్నారు. నేడు దేశంలోని ప్రతీ గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా ఉందని.. విద్యుత్, 99 శాతం గ్రామాలకు వంట గ్యాస్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇండియా గత రెండేళ్ల నుంచి 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోందని ఆయన వెల్లడించారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
గత శతాబ్ధంలో జర్మనీ, ఇతర దేశాలు పారిశ్రామిక విప్లవం నుంచి ప్రయోజనం పొందాయని.. భారత్ ఆ సమయంలో బానిసగా ఉందని, కానీ ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఇండియా వెనకబడి ఉండదని.. ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఇండియాలో స్టార్టప్స్ ఉండేవి కావని.. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉందని.. నేను మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ రెండోస్థానంలో ఉందని మోదీ వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. లక్ష్యం కన్నా ఐదు నెలల ముందే దీన్ని సాధించామని.. కోవిడ్ -19 సమయంలో భారత్ తమ ప్రజలకు టీకాలు వేయడానికి 10-15 ఏళ్లు పడుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయని.. నేడు 90 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ తీసుకున్నారని.. 95 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నవారు ఉన్నారని మోదీ వెల్లడించారు.
#WATCH LIVE via ANI FACEBOOK | PM Narendra Modi addresses members of the Indian community in Munich, Germanyhttps://t.co/fjNG1SiGCm
— ANI (@ANI) June 26, 2022
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో