హాలండ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హాలండ్ హేగ్లోని తన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన భారతీయుడు ఊపిరాడక మృతి చెందాడు. ఆసిఫ్నగర్ నివాసి అబ్దుల్ హదీ సెలవు కోసం భారతదేశానికి వచ్చి 2021 మార్చిలో తిరిగి హాలండ్ వెళ్ళాడు. హాలండ్ లోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉంటున్న అబ్దుల్ హదీ భవనంలో అగ్నిప్రమాదం…
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.. ఇవాళ తెల్లవారుజామున విద్యాసాగర్ రావు సతీమణి సరోజ ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఎమ్మెల్యే సతీమణి సరోజకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.. ఇక, గాయాలపాలైన సరోజకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. Read Also: టెన్షన్…
కూకట్పల్లిలోని శివపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. థియేటర్లోని సామాగ్రి మొత్తం అగ్నికి అహుతి అయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి…
ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…
హైదరాబాద్లోని చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా… 40 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పుట్ పాత్… దగ్గర వేసుకుని.. ఉన్న గుడిసెల్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం ధాటికి గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి.దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగి పక్కపక్కనే ఉన్న 40 గుడిసెలు దగ్ధం అయ్యాయి. Read Also:దేశ తలసరి…
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. అయితే ప్రయాణికులంతా బస్సులో నుంచి వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుంది గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి…
దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై…
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్కు దమ్మాయిగూడకు చెందిన మయూర్గా పోలీసులు గుర్తించారు.…
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి…