అగ్నిప్రమాదంపై అనుమానం… వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఫైర్ సిబ్బంది నుంచి ప్రమాదంపై పలు వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. క్లబ్కు సంబంధించిన 50 వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్తో పాటు విలువైన మద్యం, నగేసిలు, ప్రాచీన అరుదైన ఫర్నీచర్ కాల్నైట్ బార్ బంగ్లా కిచెన్, మిలటరీ అధికారుల కార్యాలయాలు అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు గుర్తించారు.
ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు క్లబ్లో మంటలు రావడాన్ని గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం వర్షం కారణంగా క్లబ్లో కరెంట్ సరఫరా నిలిచిపోయిందని… దాంతో జనరేటర్ ఆటోమేటిక్ ఆన్ అవ్వడం తిరిగి కరెంటు వచ్చిన సమయంలో ఏసీ/డీసీ షిఫ్టింగ్లో చోటుచేసుకున్న లోపాలతో మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో నష్టం రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం పెరిగే మరింత అవకాశం ఉందన్నారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
క్లబ్ భవనంలో మద్యం, క్లబ్లో ఇంటీరియర్, అంతర్గత మెట్లు, చివరకు రెయిలింగ్ టేకు, ఇతర కలపతో చేసినవి కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని దర్యాప్తు పోలీసులు భావిస్తున్నారు. 14 మీటర్ల ఎత్తున్న భవనంలో అంతర్గత మెట్లు కర్రెతో చేసినవి కావడంతో పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని పోలీసులు తెలిపారు. 9 ఫైరింజన్లను రప్పించి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించారన్నారు. ఫోమ్ స్ర్పేతో చివరకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.
కాగా క్లబ్ స్థలంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్ వరకు మంటలు వ్యాపించక పోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ప్రమాదం తీవ్రతను దాచేందుకు క్లబ్ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కమిటీ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సికింద్రాబాద్ క్లబ్ ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో క్లబ్ను నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!