విశాఖ రావాలన్న సీఎం నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి విశాఖకు వస్తుంటే ఎందుకు అభ్యంతరమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పాలన్నారు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చన్నారు.
ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ముంబై లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ముంబైలోని 24 అంతస్తుల నివాస భవనంలో గురువారం మంటలు చెలరేగాయి, కనీసం 135 మందిని అక్కడి నుండి సురక్షితంగా రక్షించినట్లు పౌర అధికారులు తెలిపారు.. వివరాల్లోకి వెళితే.. ఘోడాప్డియో ప్రాంతంలోని MHADA కాలనీలోని న్యూ హింద్ మిల్ కాంపౌండ్లో ఉన్న భవనం యొక్క మూడవ అంతస్తులో తెల్లవారుజామున 3:40 గంటలకు మంటలు చెలరేగాయని, ఇక్కడ…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నావెల్టీ సినిమా వెనుక ఉన్న కెనరా బ్యాంక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో.. కొందరు ఉద్యోగులు భవనంపై నుండి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బ్యాంకులో మంటల దాటికి బయటకురాకుండా…
ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. ఆదివారం రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి.. ఈ ప్రమాద సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.. మత్స్యకారులు తమ బోట్లు…
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేట్ బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాతంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.
న్టీవీతో క్లూస్ టీం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. నిన్నటి నుండి ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాంపిల్స్ ను సేకరించామన్నారు. 10 మంది బృందాలు ఏర్పడి క్లూస్ ను సేకరిస్తున్నాము.. సేకరించిన క్లూస్ ఆధారంగా ప్రాధమికంగా షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము.
Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనాసాగుతుంది. భవనంలో పలు ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్డికపూల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్డింగ్ ఓనర్ అడ్మిట్ అయ్యారు.