China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేట్ బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాతంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.
న్టీవీతో క్లూస్ టీం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. నిన్నటి నుండి ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాంపిల్స్ ను సేకరించామన్నారు. 10 మంది బృందాలు ఏర్పడి క్లూస్ ను సేకరిస్తున్నాము.. సేకరించిన క్లూస్ ఆధారంగా ప్రాధమికంగా షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము.
Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనాసాగుతుంది. భవనంలో పలు ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్డికపూల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్డింగ్ ఓనర్ అడ్మిట్ అయ్యారు.
నాంపల్లి బజార్ ఘాట్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భవనంలో సేఫ్టీ లేదని ఫైర్ శాఖ వెల్లడించింది. అయితే, కెమికల్ డ్రమ్స్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించింది.
నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
BiG Breaking: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్ ఘాట్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
Dal lake: ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి.