నాంపల్లి బజార్ ఘాట్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భవనంలో సేఫ్టీ లేదని ఫైర్ శాఖ వెల్లడించింది. అయితే, కెమికల్ డ్రమ్స్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించింది.
నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
BiG Breaking: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్ ఘాట్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
Dal lake: ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి.
Fire Accident: హైదరాబాద్ లో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. గోశామహల్, రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Iran: ఇరాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని ఓ డ్రగ్ రిహాబ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 32 మంది మరణించారు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27 నుంచి 32కి పెరిగినట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని వీరభద్ర నగర్లోని బస్ డిపోలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపు పది బస్సులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 బస్సులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ నుండి మధ్యప్రదేశ్లోని శివానికి వెళ్తున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఐపీఎల్ క్రికెటర్ ఇల్లు కూడా ఉండడం గమనార్హం.. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం దాదాపు 12 గంటల 30 నిమిషాల సమయంలో ముంబై లోని వెస్ట్ కాందివాలి లోని మహావీర్ నగర్ లోని పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ఈ ఘటనలో ఓ మహిళతో పాటుగా 8 సంవత్సరాల చిన్నారి మృతి చెందగా.. మరో 5 మందికి…