ఆళ్ల నాని. మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం. ఏలూరు ఎమ్మెల్యే. సీఎం జగన్కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో కినుక వహించారో ఏమో.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఏలూరులో ఇంత వరకూ ఆ ఊసే లేదన్నది అధికారపార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ రెండేళ్లు జనంలో ఉండాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ సూటిగా సుత్తిలేకుండా చెప్పినా.. ఆళ్ల నానిలో…
కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.. టూవీలర్లపై వస్తున్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.. అమలాపురంలోకి ఎంట్రీ ఇచ్చే వాహనదారులు వివరాలు మొత్తం సేకరిస్తున్నారు.. ఇక, రోడ్లపైకి వచ్చే ఆందోళన చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆయన.. విధ్వంస చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం…
గంజి ప్రసాద్ హత్య బాధాకరం అన్నారు హోం మంత్రి తానేటి వనిత. గంజి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. అనుమానితుడైన ఎంపీటీసీ బజరయ్యపై విచారణ సాగుతుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష తప్పదు. ముఖ్యమంత్రి దృష్టికి ప్రసాద్ హత్య ఘటన తీసుకువచ్చామన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటాం. ప్రజలు సంయమనం పాటించాలన్నారు మంత్రి…
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమను మూసి వేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని మూసేసినట్టు ప్రకటిస్తూ బ్యానర్ కట్టింది పోరస్ యాజమాన్యం.బ్యానర్ కడితే సరిపోదు.ఫ్యాక్టరీని సీజ్ చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం మద్దతు ప్రకటించింది. పోరస్ ఫ్యాక్టరీ మూసివేయాలంటూ చేస్తున్న ఆందోళనల్లో పాల్గొన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే పోరస్ బాధిత మృతులకు రూ. కోటి చెల్లించాలన్నారు.ఈ ప్రమాదం వెనుక…
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ…
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. కట్టుకున్నవారి దగ్గర సుఖం దొరకట్లేదని పరాయి వారి మోజులో పడుతున్నారు. చివరికి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరమవుతున్నారు. తాజాగా ఒక వివాహిత .. వావి వరస మరిచి మరిదితో అఫైర్ పెట్టుకోంది. ఆ విషయం కొద్దిరోజులకు భర్తకు తెలిసి చీవాట్లు పెట్టాడు. అంతే.. ప్రియుడితో పాటు ఇంట్లోనుంచి పారిపోయి శవాలుగా తేలారు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..ఏలూరు కొత్తపేటకు చెందిన ఒక మహిళకు…
ఆయన ఏపీలో డిప్యూటీ సీఎం. ఆయన్నే లైట్ తీసుకుంటున్నారట అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు. ఇటీవల ఒక విషయంలో తలెత్తిన రగడ చూశాక పార్టీ వర్గాల్లో వస్తోన్న డౌట్ ఇదేనట. ఇంతకీ ఎవరా డిప్యూటీ సీఎం..? ఏంటా మున్సిపల్ కార్పొరేషన్? లెట్స్ వాచ్..! డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని లెక్క చేయడం లేదా? ఎక్కడన్నా అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలు కొట్టుకోవడం, తిట్టుకోవటం కామన్. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైసీపీలో మాత్రం డిఫరెంట్. వాళ్లలో వాళ్లకే పడదో.. పదవి ఇచ్చినవాళ్లంటే…
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీకి ‘కొండా’ అని నామకరణం కూడా చేశాడు. ఈ సినిమా నేపథ్యం వరంగల్ జిల్లా కాబట్టి ఎక్కువ భాగం సినిమా షూటింగ్ను వరంగల్, ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరపాలని తొలుత నిర్ణయించారు. కానీ ఈ సినిమాపై పలువురు రాద్ధాంతాలు చేస్తున్నందున తాజాగా షూటింగ్ స్పాట్ మార్చినట్లు వర్మ తెలిపాడు. Read Also: ఒకేసారి నాలుగు…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం…
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 50 డివిజన్లలో 46 చోట్ల వైసీపీ విజయం సాధించిగా, మూడు చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుంది. అత్యధిక డివిజన్లు సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ముందునుంచే చెప్తూ వస్తున్నారు. చెప్పిన విధంగానే వైసీపీ 46 చోట్ల విజయం సాధించడం విశేషం. గెలుపొందిన 46 డివిజన్లలో మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి. ఇకపోతే, ఏలూరులో వీలైనన్ని స్థానాలు గెలుపొంది పట్టును నిరూపించుకోవాలని చూసిన టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం మూడు…