Manipur on Mute: మూగబోయిన మణిపూర్.. కనిపించని ఎన్నికల హడావుడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ రాష్ట్రంలో గత ఏడాది అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య గొడవలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ దాడుల్లో 219 మంది చనిపోయారు. ఇంకా వేల మంది పునరావాస శిబిరాల్లోనే ఉంటున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. ఇక, ప్రస్తుతానికి గొడవలు సద్దుమణిగినా ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడంతో మణిపుర్లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒక నియోజకవర్గంలో పూర్తిగా, మరో నియోజకవర్గంలో సగ భాగానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మిగిలిన సగ భాగానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. అయితే, పోలింగ్కు ఇంకా రెండు వారాలే సమయం ఉంది. అయినా, ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఎక్కడా ర్యాలీలు, సభలు, కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు..
Read Also: Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’!
Also Read
- Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
అయితే, ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి. మణిపుర్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అక్కడ ప్రచారం చేసేందుకు జాతీయ స్థాయి నేతలెవరూ వెళ్లడం లేదు.. ఎందుకంటే, అక్కడ మళ్లీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తే.. మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉంది.. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే భయంతో ఏ పార్టీ రిస్కు తీసుకోవడం లేదు.
Read Also: JP Nadda: హమ్మయ్య.. జేపీ నడ్డా భార్య కారు దొరికిందోచ్..
ఇక, వేల మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో ఉంటున్నారు.. వారంతా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శిబిరాల దగ్గరే ఓటేసేలా పోలింగ్ కేంద్రాలను రెడీ చేసింది. అయితే అభ్యర్థులు ఈ శిబిరాల దగ్గరకు వచ్చే ధైర్యం చేయడం లేదు.. మైతీలు ఉండే లోయ ప్రాంతాలతో పాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాల్లోనూ ప్రచారం చేయలేని పరిస్థితి ప్రస్తుతం మణిపూర్ లో నెలకొంది. అయితే, కొన్ని కుకీ గ్రూపులు ఇప్పటికే లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాయి.
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..