Manipur on Mute: మూగబోయిన మణిపూర్.. కనిపించని ఎన్నికల హడావుడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ రాష్ట్రంలో గత ఏడాది అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య గొడవలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ దాడుల్లో 219 మంది చనిపోయారు. ఇంకా వేల మంది పునరావాస శిబిరాల్లోనే ఉంటున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. ఇక, ప్రస్తుతానికి గొడవలు సద్దుమణిగినా ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడంతో మణిపుర్లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒక నియోజకవర్గంలో పూర్తిగా, మరో నియోజకవర్గంలో సగ భాగానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మిగిలిన సగ భాగానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. అయితే, పోలింగ్కు ఇంకా రెండు వారాలే సమయం ఉంది. అయినా, ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఎక్కడా ర్యాలీలు, సభలు, కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు..
Read Also: Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’!
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
అయితే, ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి. మణిపుర్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అక్కడ ప్రచారం చేసేందుకు జాతీయ స్థాయి నేతలెవరూ వెళ్లడం లేదు.. ఎందుకంటే, అక్కడ మళ్లీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తే.. మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉంది.. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే భయంతో ఏ పార్టీ రిస్కు తీసుకోవడం లేదు.
Read Also: JP Nadda: హమ్మయ్య.. జేపీ నడ్డా భార్య కారు దొరికిందోచ్..
ఇక, వేల మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో ఉంటున్నారు.. వారంతా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శిబిరాల దగ్గరే ఓటేసేలా పోలింగ్ కేంద్రాలను రెడీ చేసింది. అయితే అభ్యర్థులు ఈ శిబిరాల దగ్గరకు వచ్చే ధైర్యం చేయడం లేదు.. మైతీలు ఉండే లోయ ప్రాంతాలతో పాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాల్లోనూ ప్రచారం చేయలేని పరిస్థితి ప్రస్తుతం మణిపూర్ లో నెలకొంది. అయితే, కొన్ని కుకీ గ్రూపులు ఇప్పటికే లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాయి.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!