ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అలాస్కా వేదికగా పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్స్కీ, పశ్చిమ దేశాధినేతలతో కూడా చర్చలు జరిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నాలుగేళ్ల నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
యుద్ధం స్వరూపం మారిపోతోంది. సైనికులు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయిల్ పైన హమాస్ మెరుపు దాడి సమయంలోనూ డ్రోన్లే కీలకంగా వ్యవహరించాయి. ఇక, ఇజ్రాయిల్ పై పలుసార్లు డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆపరేషన్ సింధూర్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైళ్లు, యుద్ధ విమానాలు…
Amarnath Yatra: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లో జరగనున్న పవిత్ర అమరనాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న 38 రోజుల యాత్రను 581 కేంద్ర సాయుధ పోలీసు (CAPF) బలగాలతో, జామర్లు, డ్రోన్లతో కాపాడనున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో, ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.…
India-Pakistan War: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్, పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో పాక్ కి చెందిన డ్రోన్లు దూసుకు రావడంతో భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. వరుస ఘటనలతో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు.
గుజరాత్లోని కచ్లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. "కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు" అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా…
ప్రజల భద్రత మరింత పెంచేందుకు ఏలూరు పోలీసుల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై, నిర్మాణస్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దొంగలపై మాత్రమే కాదు ఊరేగింపులు, వేడుకల వద్ద అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
సైబర్ క్రైంలు, ఛీటింగ్లు జరగకుండా కంట్రోల్ చేయాలని.. రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు.
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భారీ స్థాయిలో సూసైడ్ డ్రోన్ల తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కిమ్ డ్రోన్ల పరీక్షకు సాక్షిగా మారారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.