A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా ‘ఆస్కార్’ (అకాడమీ అవార్డ్స్) ను పరిగణిస్తారు, దశాబ్దాల భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఇప్పటివరకు 10 మంది భారతీయులు ఈ గోల్డెన్ విగ్రహాన్ని ముద్దాడారు. ఇందులో సాధారణ సినిమా విభాగాలతో పాటు టెక్నికల్ మరియు సైంటిఫిక్ విభాగాలు కూడా ఉండటం విశేషం. అయితే భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఆస్కార్ పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా ఏఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలిచారు. 2009లో జరిగిన 81వ అకాడమీ అవార్డుల వేడుక భారతీయ సంగీత ప్రియులకు ఒక మధుర జ్ఞాపకం. ఆ ఒక్క రాత్రిలోనే రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.
Also Read : Priyanka Chopra : 1300 గంటలు కష్టపడి చేసిన నెక్లెస్.. ప్రియాంక మెడలో ఎలా ఉందో చూశారా?
Also Read
- Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత... 400 కోట్ల దిశగా పరుగులు
- Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
- Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి... కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
- AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల... 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
హాలీవుడ్ చిత్రం ‘స్లమ్డాగ్ మిలియనీర్’ లోని అద్భుతమైన సంగీతానికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఆ చిత్రానికి సంబంధించి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో మొదటి అవార్డు. అందరినీ ఉర్రూతలూగించిన ‘జై హో’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రెండో అవార్డు దక్కాయి.
ఒకే ఏడాది రెండు ఆస్కార్లు గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను చాటిచెప్పిన రెహమాన్, నేటికీ ఎంతోమంది యువ కళాకారులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!