Cease Fire Violation : గుజరాత్లో పాకిస్థాన్ డ్రోన్లు.. రాష్ట్ర మంత్రి కీలక సూచనలు…
గుజరాత్లోని కచ్లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. “కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు” అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా ధృవీకరించలేదు.
READ MORE: Cease Fire Violation : పాకిస్థాన్ ప్రభుత్వం మాటను ఆదేశ ఆర్మీ వినడం లేదా?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా.. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రెచ్చగొట్టే కార్యకలాపాలు మరోసారి ముమ్మరం అయినట్లు సమాచారం. శనివారం రాత్రి, పాకిస్థాన్ అనేక ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి భారీ షెల్లింగ్కు పాల్పడిందని తెలుస్తోంది. కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో అనుమానిత డ్రోన్ కారణంగా పేలుడు సంభవించిందని వార్తలు వస్తున్నాయి. అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా అంతర్జాతీయ సరిహద్దులపై పాకిస్థాన్ ఫిరంగి కాల్పులు జరిపిందని.. బారాముల్లాలో డ్రోన్ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జమ్మూలోని పలన్వాలా సెక్టార్లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని తెలుస్తోంది. శ్రీనగర్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది కాకుండా.. రాజస్థాన్లోని పోఖ్రాన్కు పెద్ద సంఖ్యలో డ్రోన్లు వస్తున్నాయి. అయితే, రక్షణ వ్యవస్థ వాటిని నాశనం చేస్తోంది. రాజౌరి నుంచి కూడా కాల్పులు జరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో