రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నాలుగేళ్ల నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓ వైపు చర్చలు.. ఇంకోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరుగుతున్న సమయంలోనే రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇక తాజాగా సముద్రంలో ఉక్రెయిన్కు చెందిన భారీ నౌకను రష్యా డ్రోన్తో పేల్చేసింది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు.. ట్రంప్ టారిఫ్లపై రాజ్నాథ్సింగ్ వ్యాఖ్య
దీనికి ప్రతీచర్యగా ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఖార్కివ్ సరిహద్దు సమీపంలో రెండు ముఖ్యమైన వంతెనలను పేల్చేసినట్లుగా సమాచారం. ఈ రెండు రష్యన్ దళాల పునరావాసం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాచి ఉంచిన మందుగుండు సామగ్రిని లక్ష్యంగా చేసుకుని తక్కువ ధర డ్రోన్ల సాయంతో వంతెనలను ధ్వంసం చేసినట్ల సమాచారం అందుతోంది. ఈ ఆపరేషన్ను ఉక్రెయిన్లోని 58వ ప్రత్యేక మోటరైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ నిర్వహించింది.
ఇది కూడా చదవండి: Indore: విచిత్ర ప్రేమికురాలు.. ప్రేమికుడి కోసం ఇంట్లో నుంచి పారిపోయి రివర్స్లో ఏం చేసిందంటే..!
డ్రోన్ ఎగురవేసినప్పుడు వంతెన కింద మందుగుండుతో ఉన్న భారీ ట్యాంకర్ కనిపించింది. అందులో సామంగ్రి, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లుగా బ్రిగేడ్ ప్రతినిధి తెలిపారు. డ్రోన్ నేరుగా మందుగుండు సామగ్రి దగ్గర వెళ్లి పేలిందని పేర్కొన్నారు.