Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Donlad Trump: ప్రధాని నరేంద్రమోడీ, డొనాల్డ్ ట్రంప్తో భేటీపై రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యా్ప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య ప్రపంచ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను ట్రంప ఖండించినట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్కి సంబంధించిన విషయాన్ని మోడీకి వదిలేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
India US: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ సర్కార్ బహిష్కరిస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్సర్కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్సర్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్లు ఇస్తున్నారు. రష్యాకు సంబంధించిన భూభాగాలు అప్పగించాలంటూ ట్రంప్ సూచించారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం మూడు వారాల్లోనే తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే అమెరికా విదేశాంగ విధానానికి కొత్త మలుపు ఇవ్వడమే కాకుండా ప్రపంచ దౌత్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చూపించారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు.
Gaza: ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గాజాపై చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గాజాలోని పాలస్తీనియన్లను ఇతర అరబ్ దేశాలు తీసుకోవాలని సూచించారు. పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని లేదంటే సాయం నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనియన్లు ఖాళీ చేసిన తర్వాతే గాజాని స్వాధీనం చేసుకుంటామని, అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గాజాపై తన ప్రతిపాదన గురించి జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనని జోర్డాన్ తోసిపుచ్చింది.…
ప్రధాని మోడీ ఫ్రాన్స్లో పర్యటించారు. మంగళవారం ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్తో సమావేశమయ్యారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దాని మొదటి దశలో ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి 'AI యాక్షన్ సమ్మిట్'కు అధ్యక్షత వహిస్తారు.