Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
S Jaishankar: లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు, జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారం సభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.
Rahul Gandhi: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీకి, అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ స్వీకారోత్సవానికి ఆహ్వానంపై ఆయన ఆరోపణలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది.
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయని ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇరువురు నేతల భేటీపై రెండు దేశాలు కృషి చేస్తున్నట్లు తెలిపింది
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ జెట్ వేగంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో, వాటిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విడుదల చేశారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించడం, వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచడం, జన్మహక్కు(బర్త్ రైట్) పౌరసత్వాలను నిషేధిస్తూ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు. దీని ప్రకారం.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాబోయే ఒకటి లేదా రెండు దశాబ్దాలకు ఏటా సగటున 8% జీడీపీ వృద్ధిని సాధించాలి.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు గమనిస్తే, ఆయన కొంత మంది ఉద్యోగులను తక్షణమే విరమించుకోమని కోరాడు. ఈ క్రమంలో ఫెడరల్ ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగులు) స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపితే వారికి 8 నెలల జీతం ఇచ్చే ఆఫర్ను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం, ఫిబ్రవరి 6లోపు ఉద్యోగులు…
S Jaishankar: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ని ‘‘అమెరికన్ జాతీయవాది’’గా జైశంకర్ అభివర్ణించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్రాజ్ కాలేజీలో గురువారం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దౌత్య స్వభావం, భారతదేశం విధానాన్ని గురించి చెప్పారు.
UK: యూకే మాజీ మంత్రి, హోం సెక్రటరీగా పనిచేసిన సుయెల్లా బ్రేవర్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా మళ్లీ గొప్పగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటన్ ‘‘ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాబోయే రెండు దశాబ్దాల్లో వెస్ట్రన్ దేశాలు ఇరాన్ తరహా పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చని చెప్పారు. బ్రేవర్మాన్ రైట్ వింగ్ థింక్ ట్యాంక్, హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.