దేశవ్యాప్తంగా ‘దీపావళి’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూజలు, నోములు, దీపాలతో యావత్ దేశం ఘనంగా దీపావళి జరుపుకుంది. గురువారం రాత్రి అయితే పటాసుల పేలుళ్లతో దేశం మొత్తం మార్మోగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బాణసంచాను కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు. దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా…
దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది.
దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది.
Raja Singh : దేశమంతా దీపావళి పండుగ ఘనంగా జరుపుకుంటుంది. చిన్నపెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
ఒంగోలు పండుగలకు ఎంతో ప్రత్యేకం.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమం ఇంకెక్కడా కనిపించదు..
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన పండగ సందర్భంగా ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంక్షించారు.
ఆయుష్మాన్ భారత్పై కేజ్రీవాల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యా్న్ని అందించనున్నారు. అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్కు చెందిన వృద్ధులు క్షమించాలని కోరారు. రాజకీయ కారణాల చేత ఈ రెండు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ…
Diwali 2024 : దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు లేదా విద్యుత్ దీపాల కారణంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేసింది. అగ్నిమాపక నియంత్రణ గదిలో పనిచేసే అధికారులు , స్టేషన్లలో పురుషుల సెలవులు రద్దు చేయబడ్డాయి , 24 గంటలూ అప్రమత్తంగా ఉంచబడ్డాయి. క్రాకర్లు కాల్చేటప్పుడు, దీపాలు లేదా కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు , షార్ట్ సర్క్యూట్ల కారణంగా నివాస…
దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.
అమెరికాలోని వైట్హౌస్లో ఏటా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. బరాక్ ఒబామా, ట్రంప్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ వరకు అందరూ దివాళి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి రోజున న్యూయార్క్లోని పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటి సారి. న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.