Diwali 2024: శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు..
- శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు
- వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి
- గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటున్న మహిళా ఫౌండేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది. ముస్లిం మహిళలు తమ చేతులతో ఉర్దూలో శ్రీరాముడికి హారతి ఇచ్చారు. ‘హే రాజా రామ్ తేరీ ఆరతి ఉతారు’ అనే కీర్తన కూడా పాడారు. ఈ క్రమంలో.. వారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. రాముని మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారు. ఈ సందర్భంగా ధర్మాచార్య మాట్లాడుతూ.. 2006లో వారణాసిలోని సంకట్ మోచన్ టెంపుల్ బాంబు ఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందన్నారు. రామనవమి, దీపావళి రోజున ముస్లిం మహిళలు ఆచారాల ప్రకారం శ్రీరాముని ఆరతిని నిర్వహిస్తారని ధర్మాచార్య చెప్పారు. దేశంలోని ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, శాంతి సందేశాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం అని అన్నారు.
Read Also: Mallikarjun Kharge: జమిలి ఎన్నికలు ఇండియాలో సాధ్యం కాదు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ఇదిలా ఉంటే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడి సందేశాన్ని అర్థం చేసుకోవాలని ఆ దేశాలకు సూచించారు. రాముడి మార్గాన్ని అర్థం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. రామరాజ్య దర్శనం ప్రజలందరినీ వివక్ష నుండి విముక్తి చేస్తుందని.. అందరినీ ఆలింగనం చేసుకోవడం గురించి మాట్లాడుతుందని ముస్లిం మహిళలు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి దేశాలు రాముడి బాటలో నడవాలన్నారు. ఏదేమైనాప్పటికీ, ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడికి హారతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాముడు ఏ ఒక్క మతానికి పరిమితం కాదని వారి హారతితో నిరూపించారు.
Read Also: Ganja: పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా.. 250 కేజీలు స్వాధీనం
తాజావార్తలు
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!