Diwali 2024: శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు..
- శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు
- వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి
- గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటున్న మహిళా ఫౌండేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది. ముస్లిం మహిళలు తమ చేతులతో ఉర్దూలో శ్రీరాముడికి హారతి ఇచ్చారు. ‘హే రాజా రామ్ తేరీ ఆరతి ఉతారు’ అనే కీర్తన కూడా పాడారు. ఈ క్రమంలో.. వారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. రాముని మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారు. ఈ సందర్భంగా ధర్మాచార్య మాట్లాడుతూ.. 2006లో వారణాసిలోని సంకట్ మోచన్ టెంపుల్ బాంబు ఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందన్నారు. రామనవమి, దీపావళి రోజున ముస్లిం మహిళలు ఆచారాల ప్రకారం శ్రీరాముని ఆరతిని నిర్వహిస్తారని ధర్మాచార్య చెప్పారు. దేశంలోని ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, శాంతి సందేశాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం అని అన్నారు.
Read Also: Mallikarjun Kharge: జమిలి ఎన్నికలు ఇండియాలో సాధ్యం కాదు
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
ఇదిలా ఉంటే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడి సందేశాన్ని అర్థం చేసుకోవాలని ఆ దేశాలకు సూచించారు. రాముడి మార్గాన్ని అర్థం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. రామరాజ్య దర్శనం ప్రజలందరినీ వివక్ష నుండి విముక్తి చేస్తుందని.. అందరినీ ఆలింగనం చేసుకోవడం గురించి మాట్లాడుతుందని ముస్లిం మహిళలు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి దేశాలు రాముడి బాటలో నడవాలన్నారు. ఏదేమైనాప్పటికీ, ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడికి హారతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాముడు ఏ ఒక్క మతానికి పరిమితం కాదని వారి హారతితో నిరూపించారు.
Read Also: Ganja: పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా.. 250 కేజీలు స్వాధీనం
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..