Raja Singh : దీపావళి పటాకుల పైన లక్ష్మీ దేవి బొమ్మ పెట్టి అమ్ముతున్నారు.. ఇదో కుట్ర : రాజాసింగ్
Raja Singh : దేశమంతా దీపావళి పండుగ ఘనంగా జరుపుకుంటుంది. చిన్నపెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అలాగే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘‘ నమస్కారం మిత్రులారా.. నేను మీ రాజాసింగ్.. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు దీపావళి పండుగ మనం జరుపుకుంటున్నాం. ఈ దీపావళి పండుగ రోజు చాలా పెద్ద ఎత్తున పటాకులు తెప్పించి కాలబెడుతున్నాం. కానీ కొద్దిగా జాగ్రత్త. చిన్న చిన్న పిల్లలు ఉంటారు.
Read Also:HIV cases: వామ్మో ‘‘పులిరాణి’’.. ఒక మహిళ నుంచి పలువురికి హెచ్ఐవీ..?
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
వారికి ఏ పటాకాలో ఎంత పెద్ద బ్లాస్ట్ ఉంటుందో వారికి తెలియదు. అందుకే మన పిల్లల వెంట ఉండి పటాకులు కాలబెట్టాలని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా చాలా పెద్ద కుట్ర.. ఒకప్పుడు జరిగిన కుట్ర కంటిన్యూగా అదే విధంగా జరుగుతుంది. దీపావళి అంటే మనం లక్ష్మీ మాతాకు పూజ చేస్తాం. అదే పటాకాలో మన లక్ష్మీ మాత బొమ్మ పెట్టి అమ్ముతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర నడుస్తోంది. మనమంతా కలిసి దేవుడి బొమ్మ ఉన్న పటాకులు కొనవద్దు. కాల్చవద్దు. వచ్చే ఏడాది ఎవరూ లక్ష్మీ దేవీ బొమ్మ ఉన్న పటాకులు తయారు చేయరు.. కొనరు. ఈ విధంగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటున్నాను. మరొక్క సారి దీపావళి శుభాకాంక్షలు.’’ అంటూ చెప్పుకొచ్చారు.
Read Also:Biahr : రెండుగా విడిపోయిన గూడ్స్ రైలు.. ఆందోళనతో జనాల కేకలు
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!