భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(77) కన్నుమూశారు. బిషన్ సింగ్ బేడీ టీమిండియాలో గొప్ప స్పిన్నర్. అతను 1946 25 సెప్టెంబర్ న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్ ల్లో విన్నర్గా నిరూపించుకున్నాడు.
దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున బాణాసంచాలను తయారు చేసి, నిల్వ ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చి వేశారు. దీంతో అనుకోకుండా ఓ ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకుపోయింది. దాంతో, ఒక్కసారిగా అందులోని బాణాసంచా పెద్ద ఎత్తున పేలింది. గంటకు పైగా, ఈ పేలుళ్లు కొనసాగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఏనుగు కేర్ టేకర్ పై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నేటి (శనివారం) సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ అనే మావటిపై ఓ ఏనుగు సడెన్ గా దాడి చేసింది.
భూవివాదం తెచ్చిన గొడవతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో జరిగింది.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బీహార్ లోని పిదాసిన్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నిరంజన నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడార. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరోవైపు నదిలో గల్లంతైన ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు.
పండగ పూట ఆనందాలు నిడాల్సిన వేళా ఆ కుటుంబాల్లో విషాదం నిండిది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా పండగ జరుపుకున్న ఇద్దరు యువకులు దురదృష్ట వశాత్తు వేరు వేరు చోట్ల వేరు వేరు కారణాలతో మరణించారు.
చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు.