గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఒమన్లోని మిడిల్ ఈస్ట్ నగరంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి 13 మంది చనిపోయారు. యుఏఈకి చెందిన ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమన్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ఓ చిన్నారి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై…
పాకిస్థాన్ దేశంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ లోని సింధ్ రాష్ట్రంలో గల సంఘర్ జిల్లాలో బోర్వెల్లోని కలుషిత నీరు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు.
చిత్తూరు జిల్లా రూరల్ మండలం పచ్చనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారుల ఈత సరదా గ్రామాన్ని శోక సముద్రంలో ముంచింది. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఈత సరదా కోసం సమీపంలోని చెరువుకు వెళ్లారు. అయితే.. చెరువులో బురద ఎక్కువగా ఉండటంతో అందులో చిక్కుకుని ఇద్దరు బాలురు సంజయ్(15), ఆకాష్ (15) మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు.. చెరువు వద్దకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక పోయింది.…
రంగుల పండుగ రోజున వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. రెండు చోట్ల జరిగిన బైక్ ప్రమాదాల్లో ముగ్గురు చనిపోతే, సరదాగా ఈతకెళ్లి మరో చిన్నారి మృతి చెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Road Accident : బీహార్లోని బెగుసరాయ్లో హోలీ రోజున పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ కారు అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
తీర్థయాత్రల కోసమని బయల్దేరిన పండితులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దేవుడిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భావించినా వారు.. డైరెక్టుగా దేవుడి దగ్గరికే వెళ్లారు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పండితులు మరణించారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కోచింగ్ క్లాస్లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో…